తెలుగులో ముకుంద సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయిన బాలీవుడ్ భామ పూజా హెగ్డే టాలీవుడ్‌లో స్టార్ హీరోల‌తో న‌టించి మంచి పేరు తెచ్చుకుంది. బ‌న్నీతో డీజే, వ‌రుణ్‌తో ముకుంద‌, ఆ త‌ర్వాత ఎన్టీఆర్‌తో అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌, మ‌హేష్‌తో మ‌హ‌ర్షి సినిమాల్లో ఆమె న‌టించింది. వ‌రుస‌గా టాలీవుడ్ స్టార్ హీరోల‌తో న‌టిస్తోన్న పూజా ప్ర‌స్తుతం ప్ర‌భాస్ కొత్త మూవీ ( వ‌ర్కింగ్ టైటిల్ జాన్‌, ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌) లో న‌టిస్తోన్న ఆమె వ‌రుణ్ తేజ్ సినిమాతో పాటు అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘అల వైకుంటపురంలో’ సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెల్సిందే.


వ‌రుసగా స్టార్ హీరోల‌తో న‌టించే ఛాన్సులు రావ‌డంతో ఆమె బిహేవియ‌ర్‌లో బాగా చేంజెస్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఆమె రేటు చుక్క‌ల్లోనే ఉంటోంద‌ట‌. కాస్త త‌గ్గించుకోమ‌ని నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు కోరుతున్నా ఊహూం అని ఖ‌రాఖండీగా చెపుతోంద‌ట‌. పోనీలే క్రేజ్ ఉంది క‌దా అని ఆమె అడిగినంత ఇచ్చి తీసుకున్నా షూటింగ్‌లో చుక్కలు చూపించేస్తోంద‌ట‌. పూజ‌ సరిగా షూటింగ్ కి రావడంలేదని, చాలా లేట్ గా షూటింగ్ కి వస్తుందని,  మధ్యాహ్నం భోజన సమయానికి కూడా బయటకు వెళ్లి షూటింగ్ కి మళ్ళీ చాలా ఆలస్యంగా వస్తుందని, దీనివల్ల సినిమా లేట్ అవుతుందని కంప్లైంట్స్ ఉన్నాయి.


ప్ర‌స్తుతం ఆమె బ‌న్నీ - త్రివిక్ర‌మ్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా యూనిట్‌కు ఆమె చుక్క‌లు చూపించేస్తోంద‌న్న వార్త‌లు ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో బాగా వినిపిస్తున్నాయి. వాస్త‌వానికి ఈ సినిమాను వ‌చ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. కానీ పూజ ప్ర‌తి రోజు షూటింగ్‌కు లేట్‌గా రావ‌డంతో సినిమా షెడ్యూల్స్ అనుకున్న టైంకు పూర్తి కావ‌డం లేద‌ని టాక్‌.


ఈ సినిమాలో బ‌న్నీ ప‌క్క‌న హీరోయిన్‌ను సెట్ చేసేందుకు, షూటింగ్ స్టార్ట్ చేసేందుకే చాలా టైం ప‌ట్టింది. ఇక ఇప్పుడు పూజ చ‌ర్య‌ల‌తో షూటింగ్ కూడా త్వ‌ర‌గా జ‌ర‌గ‌డం లేదు. ఈ రేంజులో షూటింగ్ జ‌రుగుతుంటే సంక్రాంతికి సినిమా వ‌స్తుందా ? అన్న సందేహాలు కూడా ఉన్నాయి. పూజ తన వైఖరి మార్చుకోకపోతే తన కెరీర్ పై ప్రభావం పడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: