ఇటీవల బిగ్ బాస్ హౌస్ నుండి ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో ఇంటి సభ్యులలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ముందునుండి హౌస్ లో పేరు తెచ్చుకున్న అలీ రెజా తాజాగా మొట్టమొదటిసారి ఎలిమినేషన్ కి సెలెక్ట్ అయ్యి హౌస్ నుండి ఎలిమినేట్ కావడంతో ఇంటి సభ్యులతో పాటు బిగ్ బాస్ వీక్షకులు కూడా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ముఖ్యంగా ఇంటి లోని సభ్యులంతా అలీ రెజా ఎలిమినేషన్ అవ్వటం ఎవరు కూడా ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో అలీ రెజా మళ్లీ ఇంటిలోకి వస్తారని మరో ఛాన్స్ బిగ్ బాస్ ఇస్తారని టాక్ వినపడుతోంది.


50 రోజులు పూర్తయిన సందర్భంగా బిగ్ బాస్ షో ప్రేక్షకుల హృదయాలను అలీ రెజా బాగా దోచుకోవడం తో సోషల్ మీడియాలో అలీ రెజా కు భయంకరమైన మద్దతు పోస్టింగులు పెడుతున్నారు. ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లోకి అలీ రెజా రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయం అని చాలామంది అంటున్నారు. ముఖ్యంగా హౌస్ నుండి బయటకు వచ్చాక నాగార్జునతో స్టేజిపై నిలబడిన తరువాత యాంకర్ నాగార్జున అలీ రెజా తో ముచ్చటిస్తూ మరోసారి అవకాశం ఇస్తే బిగ్ బాస్ హౌస్ లో చేస్తావా ప్రశ్నించడం జరిగింది. దీంతో కచ్చితంగా షోలో తిరకాసు ఉందని ఇందు మూలంగానే నాగార్జున అలీ రెజా నీ ప్రశ్నించడం జరిగిందని చాలా మంది ప్రేక్షకులు అంటున్నారు.


అంతేకాకుండా మరికొన్ని రోజుల్లో ఓటింగ్ పద్దతి ద్వారా ఎలిమినేట్ అయిన ఇద్దరు సభ్యులకు బిగ్ బాస్ లో మళ్ళీ పాల్గొనే అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద ఇప్పటి వరకు హౌస్ నుండి ఎలిమినేట్ అయిన వారి పేర్లు గమనిస్తే మొట్టమొదటిగా హేమ తర్వాత జాఫర్ మరియు తమన్నా సింహాద్రి, రోహిణి, అషు రెడ్డి, అలీ ఎలిమినేట్ కావడం జరిగింది. మరి జరుగుతున్న ప్రచారం బట్టి వాస్తవం అయితే వీరిలో మళ్లీ ఎవరు షో లోకి వస్తారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: