టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, పూజ హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం అల వైకుంఠపురములో. మంచి కమర్షియల్ అంశాలతో ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపిన కథగా త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. హారిక హాసిని క్రియేషన్స్, గీత ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తుండగా, పిఎస్ వినోద్ ఫోటోగ్రఫీని అందిస్తున్నారు. ఇప్పటికే యాభై శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా, 

వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ సినిమాలో అక్కినేని సుశాంత్, నివేత పేతురాజ్, సీనియర్ నటి టబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా మొత్తానికి ఎంతో కీలకమైన ట్విస్ట్ ఒకటుందని, దానితో సినిమా మొత్తం మంచి ఆసక్తికరంగా సాగుతుందని నేడు టాలీవుడ్ వర్గాల్లో ఒక వార్త ప్రచారం అవుతోంది. అయితే ఆ వార్త ప్రకారం, సినిమాలో ప్రీ ఇంటర్వెల్ సీన్ లో టబు పాత్ర ఎంటర్ అవుతుందని, అదే సమయంలో వచ్చే ఒక పెద్ద ట్విస్ట్ తో, 

అప్పటివరకు ఒకవిధంగా సాగిన సినిమా కథ, అక్కడినుండి మరింత ఆసక్తికరంగా ముందుకు సాగుతుందని అంటున్నారు. ఇక సినిమాలో ఎంతో పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్న టబు, ఆ పాత్రలో ఎంతో ఒదిగిపోయి నటించినట్లు చెప్తున్నారు. అయితే నేడు ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదుగాని, ఒకవేళ ఈ వార్త కనుక నిజమే అయితే, అటువంటి ఆకట్టుకునే ట్విస్టుతో అల వైకుంఠపురములో సినిమా మంచి సక్సెస్ సాధించే అవకాశం ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా ఈ వార్త ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: