శ్రద్ధా శ్రీనాథ్ ఈ మద్య టాలీవుడ్ లో దర్శనమిస్తున్న కన్నడ సినీ నటి. కేవలం కన్నడంలోనే కాదు మలయాళం, తెలుగు,  తమిళ మూవీస్  కనిపిస్తుంది. శ్రద్ధా శ్రీనాథ్   ఉధంపూర్ పట్టణంలో 1990 సెప్టెంబర్ 29న  జమ్మూ కాశ్మీర్ జన్మించింది. గతకొద్ది రోజులుగా మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న విషయం తెలిసిందే. పలువురు సినీ ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ స్టార్ హీరోలు మాత్రం అస్సలు స్పందించడం లేదు . దాంతో వాళ్ళని కించపరిచేలా కామెంట్ చేసింది శ్రద్దా శ్రీనాథ్.

దక్షినాదికి చెందిన ఈ భామ అంతగా సక్సెస్ కాలేదు కానీ మీటూ అంటూ స్టార్ హీరోలను కామెంట్ చేసి సంచలనం సృష్టించింది.  ఆ మద్య ఈ విషయంపై శ్రద్దా శ్రీనాథ్ పై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కించిన ఓ లవ్ ఓరియంటెడ్ సినిమాలో చైతు నటించబోతున్నాడు.  శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా చేస్తోందట.  జెర్సీ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.  జెర్సీ మంచి హిట్ కొట్టడంతో శ్రద్దా శ్రీనాథ్ కు అవకాశాలు వస్తున్నాయి.  ఇలీవల ఆది సాయికుమార్ నటించిన ‘జోడి’ సినిమాలో నటించింది.

కానీ ఈ మూవీ దారుణమైన డిజాస్టర్ అయ్యింది. ‘జోడీ’ సినిమా అయినా తెలుగులో తనకి ఆఫర్స్ అందిస్తుందని ఆశిస్తే అది కాస్త బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అయితే ప్రస్తుతానికి శ్రద్దా కన్నడలో రెండు సినిమాలు తమిళ్ ఒకటి చేస్తుంది. కన్నడలో హీరోయిన్ గా మంచి విజయాలు అందుకున్న ఈ భామ తమిళ్ లో కూడా సినిమాలు చేసినప్పటికీ ఈ ఏడాది టాలీవుడ్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టింది.కానీ ఇక్కడ కూడా అనుకున్న హిట్స్ రాకపోవడంతో కెరీర్ కష్టాల్లో పడిపోనుందా అని సినీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: