మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కొన్నాళ్ల క్రితం వరుసగా ఆరు అపజయాలను మూటగట్టుకుని, కెరీర్ పరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుని కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రలహరి సినిమా విజయాన్ని అందుకుని తేజ్ కెరీర్ కు మంచి బ్రేక్ ని ఇచ్చింది. ఇక ఆ సినిమా ఇచ్చిన మంచి జోష్ తో ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు తేజు. ఇటీవల ఆ సినిమాకు ప్రతిరోజు పండగే అనే టైటిల్ ని నిర్ణయించడం జరిగింది. టాలీవుడ్ భారీ నిర్మాణ సంస్థలైన గీతా ఆర్ట్ పిక్చర్స్ 2, యువి క్రియేషన్స్ సంస్థలు భారీ లెవెల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 

రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. తేజు, రాశి ల కలయికలో సుప్రీం వంటి సూపర్ హిట్ సినిమా అనంతరం, మరొక్కసారి వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలున్నాయి. ఇటీవల శర్వానంద్ తో తీసిన మహానుభావుడు సినిమాతో మంచి హిట్ అందుకున్న మారుతి, ఆ తరువాత నాగ చైత్యనతో తీసిన శైలజ రెడ్డి అల్లుడుతో పర్వాలేదనిపించారు. ఇక ఈ సినిమాను ఒక మంచి ఆకట్టుకునే కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్న మారుతి, తప్పకుండా సినిమాను మంచి సక్సెస్ చేయాలని కసిగా పనిచేస్తున్నాడట. ఇక ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ ని కాసేపటి క్రితం సోషల్ మీడియా మాధ్యమాల్లో రిలీజ్ చేయడం జరిగింది. 

మూడు తరాలకు సంబందించి సాగే కుటుంబకథగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇక నేడు రిలీజ్ చేసిన ఈ ప్రీ లుక్ పోస్టర్ లో ఇద్దరు వ్యక్తుల చేతులు కలిసి పెనవేసుకుని ఉండడం గమనించవచ్చు. ఇక ఈ పోస్టర్ లో వేలు విడువని బంధం అనే ట్యాగ్ లైన్ ని కూడా చేర్చారు సినిమా యూనిట్. ఏది ఏమైనప్పటికీ నేడు రిలీజ్ అయిన ప్రతిరోజు పండగే ప్రీ రిలీజ్ పోస్టర్, ప్రేక్షకుల్లో సినిమాపై మంచి ఆసక్తిని రేకెత్తించింది అనే చెప్పాలి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం...!!


మరింత సమాచారం తెలుసుకోండి: