ఒకటి కాదు రెండు కాదు..ఏకంగా సంవత్సరం పైగా ఎన్నో రకాల కథలు చేతులో పట్టుకొని తాను కోరకున్న హీరోని మెప్పించడానికి నానా తంటాలు పడ్డారు ఓ దర్శకుడు.  ఎట్టకేలకు అందరూ మెచ్చుకునేలా హీరోయిజం ఎలివేట్ అయ్యేలా ఓ స్క్రిప్ట్ తయారు చేశారట. ఇంతకీ ఎవరా దర్శకులు..ఎవరా హీరో అనుకుంటున్నారా?  ఒకప్పుడు టాలీవుడ్ లో ట్రెండ్ సృష్టించిన ఆర్య మూవీ దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్.  వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్య సూపర్ డూపర్ హిట్ అయ్యింది. 

ఆ తర్వాత ఆర్య 2 తీశాడు..కానీ అది పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో మరో మూవీకి ప్లాన్ చేశారు..కానీ అది సెట్స్ పైకి రాలేదు.  రాంచరణ్ తో రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసిన తర్వాత అల్లు అర్జున్ కి ఓ కథ వినిపించాడట సుకుమార్. కానీ ఆ కథ విశ్రాంతి తర్వాత వచ్చేక ఎపిసోడ్స్ కొన్ని బన్నికి నచ్చలేదట. దాంతో కథలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని చెప్పడంతో నెలల పాటు కథపై కసరత్తు  చేశాట. ఇటీవల మరో కథతో వెళ్తే అదే పరిస్థితి నెలకొన్నదట.

ప్రస్తుతం అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ‘అలా వైకుంఠపురములో’ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.  ఈ మూవీలో పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తుంది..మరో ముఖ్యపాత్రలో టబు నటిస్తుంది. ఈ సినిమా తరువాత సుకుమార్ తో కలిసి అల్లు అర్జున్ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ ఒక కథను సిద్ధం చేశాడు.

ఈ కథలో కొన్ని మార్పులు చేసిన అనంతరం అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గతంలో తమ కాంబినేషన్లో 'ఆర్య'.. 'ఆర్య 2' వంటి ప్రేమకథా చిత్రాలే వచ్చాయి గనుక, ఆ తరహా సినిమానే చేద్దామని అల్లు అర్జున్ చెప్పాడట. దాంతో సుకుమార్ అల్లు అర్జున్ కోసం మరో లైన్ ను వినిపించడం .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందట.  మొత్తానికి త్రివిక్రమ్ తో మూవీ పూర్తి కాగానే మంచి హిట్ కాంబినేషన్ రాబోతుందన్నమాట.



మరింత సమాచారం తెలుసుకోండి: