6 వరుస  పరాజయాల తరువాత ఎట్టకేలకు  సుప్రీం హీరో  సాయి ధరమ్ తేజ్ ఇటీవల చిత్రలహరి తో  ప్రేక్షకుల ముందుకు వచ్చి  హిట్టు కొట్టాడు.  ఈ సినిమా ఇచ్చిన  జోష్ తో ప్రస్తుతం వరుస సినిమాలకు  కమిట్ అవుతున్నాడు  ఈహీరో.  అందులో  భాగంగా ప్రస్తుతం  సాయి ధరమ్, మినిమం గ్యారెంటీ  డైరెక్టర్ మారుతీ తో 'ప్రతి రోజూ పండగే' చిత్రాన్ని చేస్తున్నాడు.  పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం యొక్క షూటింగ్ తుది దశకు చేరుకుంది. 



ఇక ఇప్పటినుండే ఈసినిమా  ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేశారు. అందులో భాగంగా  ఈ రోజు ఈ చిత్రం యొక్క ప్రీ లుక్ పోస్టర్ ను విడుదలచేయగా  రేపు  రాత్రి  8గంటలకు  ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదలచేయనున్నారు. గీతా ఆర్ట్స్ 2 , యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా  నిర్మిస్తున్న ఈ చిత్రం లో  రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.  కాగా  సాయి ధరమ్ - రాశిఖన్నా జోడిగా నటించడం ఇది రెండో సారి. ఇంతకుముందు వీరి కలయికలో అనిల్ రావిపూడి  తెరకెక్కించిన సుప్రీమ్ సూపర్ హిట్ అయ్యింది.  ఇక  ఈ ప్రతిరోజూ పండగే  ను డిసెంబర్ లో విడుదలచేయనున్నారు.   



ఈ సినిమాతరువాత  సాయి ధరమ్  ప్రస్థానం ఫేమ్ దేవాకట్టా డైరెక్షన్ లో నటించనున్నాడు. డిసెంబర్ నుండి ఈ చిత్రంసెట్స్ మీదకు వెళ్లనుంది.  ఇక ఈసినిమాతో పాటు  తేజూ తాజాగా మరో సినిమాకు సైన్ చేశాడట. ఉయ్యాలా జంపాల అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసినా సుబ్బు తో సాయి ధరమ్  సినిమాకు ఓకే చెప్పాడట. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఎస్ వి సి సి క్రియేషన్స్ పతాకం ఫై  ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: