తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన  మేనేజర్ల రజతోత్సవ  వేడుక ఆదివారం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ  మేనేజర్ల రజతోత్సవ  వేడుకకి గతంలో ఎప్పుడు లేనంతగా టాలీవుడ్ లోని చాలా మంది సీనియర్ నటులు . సినీ  ప్రముఖులు హాజరయ్యారు. దీనితో ఈ వేడుక భారీగా మారిపోయింది. అనుకున్న స్థాయి కంటే మరింత గొప్పగా సాగడంతో నిర్వాహకులు కూడా ఆనందంలో మునిగిపోయారు. అలాగే ఈ కార్యక్రమంలో టాలీవుడ్ కి చెందిన చాలామంది స్టార్ హీరోయిన్స్ తో పాటుగా యంగ్ హీరోయిన్స్ కూడా   లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అలాగే ఈ వేడుకకి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అథితిగా హాజరైయ్యారు. 
మెగాస్టార్ ఈ వేడుకకి రావడంతో ఈ షో మరింత గ్రాండ్ గా సాగింది అని చెప్పడానికి అతిశయోక్తి లేదు కానీ , మెగాస్టార్ రాకతో , స్టార్ హీరోయిన్ అయిన రకుల్ ఫీల్ అయినట్టు తెలుస్తుంది. అసలు మెగాస్టార్ రాక ..ఆమెని ఎందుకు బాధపెట్టింది అని అనుకుంటున్నారా . ఇక అసలు విషయానికొస్తే ... మేనేజర్ల రజతోత్సవ కార్యక్రమం లో రకుల్  ప్రీత్ సింగ్ కూడా ఓ డ్యాన్స్ పెర్ఫార్మన్స్  ఇవ్వడానికి కమిట్ అయింది. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ప్రదర్శన తరువాత రకుల్ ప్రీత్ పెర్ఫార్మన్స్ మొదలు కావాల్సివుంది. కానీ , సరిగ్గా రకుల్ పెర్ఫార్మన్స్ స్టార్ట్ అవుతుంది అనగా మెగాస్టార్ చిరంజీవి రావడంతో హడావిడి మొదలైంది. 
ఆ తరువాత వేడుకకి వచ్చిన  ప్రముఖుల స్పీచ్ కార్యక్రమం మొదలైంది. ఆ పై మెగాస్టార్ చిరంజీవిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానించి మాట్లాడించారు. ఆలా కార్యక్రమానికి ముగింపు పలకడంతో రకుల్ పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి సమయం లేకపోవడంతో ... రకుల్ ఫీల్ అయ్యి , ఆ కార్యక్రమం మధ్యలో నుండే వెళ్ళిపోయింది. 
 నిర్వాహుకులు మాత్రం సమయం లేకపోవడంతోనే రకుల్ పెర్ఫార్మన్స్ రద్దు చేసినట్టు తెలిపారు. ఇకపోతే ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వరుస అవకాశాలతో దూసుకుపోయిన రకుల్ ప్రస్తుతం అవకాశాల వేటలో  వెనుకపడిపోయింది. ఇటీవల మన్మథుడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో  తన బోల్డ్ పెర్ఫార్మన్స్ తో అభిమానులకి షాకిచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: