ఈ మద్య రామ్ హీరోగా నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ హిట్ కావడంతో తెగ సంతోషంలో ఉన్నాడు దర్శకుడు పూరి జగన్నాధ్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తీసిన ‘టెంపర్ ’మూవీ మంచి సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత ఒక్క హిట్ కూడా లేకుండా పోవడంతో ఎంతో నిరాశతో ఉన్నాడు పూరి.  ‘ఇస్మార్ట్ శంకర్’అనుకున్న దానికంటే సినిమా మంచి విజయం సాధించింది.  రామ్ కెరీర్లో ఇది భారీ హిట్.  తన దర్శకత్వానికి డోకా లేదని, తన కలంలో పదును తగ్గలేదని పూరి నిరూపించారు.  అప్పటి వరకు పట్టించుకోని నిర్మాతలు పూరి వైపు చూడటం మొదలు పెట్టారు.

ఇంత కరువులో తనకు మంచి హిట్ మార్క్ తెచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ సీక్వెల్ తీసే పనిలో ఉన్నాడు పూరి. అంతకన్నా ముందు క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ మూవీ తెరకెక్కించే పనిలో ఉన్నాడు.  త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది. టాలీవుడ్ లో రాంగోపాల్ వర్మ తర్వాత షార్ట్ టైమ్ లో సినిమాలు కంప్లీట్ చేసేది పూరి అని అందరికీ తెలిసిందే.  ఎప్పుడు మొదలు పెడతాడో తెలియదు..ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో తెలియకుంటా టక్కున రిలీజ్ చేస్తుంటాడు. అదే స్థాయిలో సినిమా ప్రమోషన్ కూడా చేస్తుంటాడు. ఎంత పెద్ద హీరోతో సినిమా అయినప్పటికీ తక్కువ రోజుల్లోనే సినిమాను పూర్తి చేయడం విశేషం. 

గతంలో మహేష్ పోకిరి, బిజినెస్ మెన్ సినిమాలను కేవలం 100 రోజుల్లోపే ముగించేశాడు.  గతంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో బుజ్జిగాడు సినిమా తీశాడు.  ఈ మూవీలో మోహన్ బాబు, ప్రభాస్ నటన అద్భుతంగా ఉండటంతో సూపర్ హిట్ అయ్యింది. ఆతర్వతా ఏక్ నిరంజన్ ప్లాప్ అయ్యి తీవ్ర నిరాశను మిగిల్చింది.  కాగా, ఇటీవలే ప్రభాస్ ను కలిసి ఓ కథ చెప్పాడట పూరి.  పూరి లైన్ ప్రభాస్ కు బాగా నచ్చింది.  దీంతో ప్రభాస్ కు పూర్తి స్క్రిప్ట్ ను నరేట్ చేసి ఫిక్స్ చేసుకోవాలని చూస్తున్నారు.  ఇది గనక సక్సెస్ అయితే పూరి,   ప్రభాస్ ను తగ్గట్టుగా పాన్ ఇండియామూవీని సెట్ చేస్తారేమో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: