పూరి జగన్నాధ్-రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో ఇంతకముందు బ్యాక్ టు బ్యాక్ ఏక్ నిరంజన్, బుజ్జిగాడు సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు మరీ సూపర్ హిట్ కాకపోయినప్పటికి కమర్షియల్ గా మాత్రం ఒక మోస్తారుగా ఆడాయి. ఆ తర్వాత ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందని అటు పూరి ఫ్యాన్స్ ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ చాలా సార్లు అనుకున్నారు. కానీ అది వర్కౌట్ కాలేదు. బాహుబలి తో ప్రభాస్ రేంజే మారిపోయింది. ఇక రీసెంట్‌గా వచ్చిన సాహో సినిమాని కూడా 350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించి నాలుగు ప్రధాన భాషల్లో రిలీజ్ చేశారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ జాన్ అనే సినిమాలో నటించబోతున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను కూడా దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తారని తెలుస్తోంది. 

ఇక పూరి జగన్నాధ్ గత కొంత కాలంగా డిజాస్టర్లతో సతమతమయ్యాడు. ఒక దశలో ఏ హీరో కూడా పూరి కథ వినడానికి ఆసక్తి చూపలేదు.మహేష్ తో పోకిరి- బిజినెస్ మేన్ లాంటి క్రేజీ సినిమాల్ని తీశారు. కానీ ఆ తర్వాత నుంచి మహేష్ తో ఎందుకనో పూరికి మహేష్ కి సెట్ అవలేదు. అంతేకాదు పూరి కష్టాల్లో ఉన్నప్పుడు మహేష్ కి కథ చెబితే నో చెప్పారట. దీంతో బాగా హర్ట్ అయ్యారు కూడా. ఇక రీసెంట్‌గా రాం పోతినేని హీరోగా పూరి నిర్మించి తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకోవడమే కాకుండా దాదాపు 75 కోట్ల పైనే వసూళ్ళు సాధించింది. 

దీంతో పూరీ మళ్ళీ ఫుల్ ఫాం లోకి వచ్చేశాడు. ఇప్పుడు పూరి కథకు నో చెప్పిన వాళ్ళే మళ్ళీ పూరీ తో జతకట్టడానికి రెడి అవుతున్నారు. ఇక ఇప్పటికే విజయ్ దేవరకొండ తో ఫైటర్ అనే సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమా తర్వాత పూరి ప్రభాస్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని లేటెస్ట్ గా న్యూస్ ఒకటి బాగా వైరల్ అవుతోంది. అంతేకాదు ప్రభాస్ కు ప్రస్తుతం ఉన్న క్రేజును ఉపయోగించి పాన్ ఇండియా లెవల్లో పూరి ఏదైనా సాధించాలని అనుకుంటున్నాడా? అన్న సందేహం అందరిలోను మొదలైంది. ఏదేమైనా ఈ కాంబినేషన్ గనక సెట్ అయితే మాత్రం మళ్ళీ ఇండస్ట్రీలో కొంతకాలం పాటు చెప్పుకునే సినిమా అవడం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: