బాలీవుడ్ లో అజయ్ దేవగన్ హీరోగా టాబు, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటించిన సూపర్ డూపర్ హిట్ అయిన దే దే ప్యార్ దే చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్ సంస్థ తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించింది . ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ ను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు, చేర్పులు చేసి రెడీ చేశాడు దర్శకుడు శ్రీవాస్ . విక్టరీ వెంకటేష్ హీరో గా దే దే ప్యార్ దే చిత్రాన్ని రీమేక్ చేయనున్నట్లు సురేష్ ప్రొడక్షన్ అధినేత సురేష్ బాబు ప్రకటించిన విషయం తెల్సిందే .
నాగార్జున హీరోగా రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించిన మన్మథుడు - 2 సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన తరువాత, దే దే ప్యార్ దే సినిమాలో నటించేందుకు వెంకటేష్ పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది . మన్మథుడు మాదిరిగానే మన్మథుడు- 2 సినిమా కూడా సూపర్,డూపర్ హిట్ అవుతుందని భావిస్తే అట్టర్ ఫ్లాప్ కావడం తో పాటు , నాగార్జున తన కూతురు వయస్సున్న రకుల్ ప్రీత్ తో రొమాన్స్ చేయడం వల్ల, నెటిజన్ల నుంచి విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు తాను కూడా దే దే ప్యార్ దే రీమేక్ చిత్రం లో కుర్ర హీరోయిన్ తో జత కడితే ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారో ? లేదోనని వెంకటేష్ సంశయిస్తున్నట్లు తెలుస్తోంది .
అందుకే దే దే ప్యార్ దే చిత్రం రీమేక్ లో నటించడానికి వెంకీ పెద్దగా ఆసక్తి చూపించడం లేదని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి . ఇప్పటికే ఈ చిత్రం హక్కులను కొనుగోలు చేసిన సురేష్ సంస్థ , వెంకటేష్ తో కాకుండా మరొక హీరోతో ఈ సినిమా ను రీమేక్ చేస్తుందా ?, లేకపోతే వెంకటేష్ ను ఒప్పించి నటించేలా చేస్తుందా ?? అన్నది ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది .