ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 'సాహో' సినిమా భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. తీరా సినిమా చూశాక మొట్టమొదటి షో కే ఫ్లాప్ టాక్ సొంతం చేసుకోవడంతో డైరెక్టర్ సుజిత్ పై ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా లో టార్గెట్ చేసి భయంకరంగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు. దీంతో ప్రభాస్ అభిమానుల పై సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ పెట్టాడు డైరెక్టర్ సుజిత్. ప్రభాస్ అభిమానులు చేస్తున్న విమర్శలకు స్పందిస్తూ...నేరం చేసినట్లు...: 'నేను ప్రభాస్ సర్‌తో సినిమా చేశాను. నా నిర్మాతలు, నేను కథను నమ్మి తీశాం. భారీగా ప్రేక్షకులు వచ్చి ఈ చిత్రం చూశారు.


అయినప్పటికీ నేను ఏదో నేరం చేసినట్లు ట్రీట్ చేస్తున్నారు'' అని సుజీత్ అన్నారు.టార్గెట్ ఎందుకు చేస్తున్నారు : మీడియా అంతటా నన్ను టార్గెట్ చేస్తూ అందరూ ఎందుకు వార్తలు రాస్తున్నారో అర్థం కావడం లేదు. నేను ఆఖరుగా మూవీ రిలీజైన ఒక రోజు తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చాను. ‘నో కామెంట్స్' అని నేను చెప్పినా కూడా అది కాంట్రవర్శిగా మారిపోయింది, ఆ కామెంట్లను కూడా నాకు వ్యతిరేకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని సుజీత్ ఆవేదనతో అన్నారు.


అంతేకాకుండా సినిమా చూసిన ప్రతి ఒక్కరు నచ్చితే బాగుంది అని చెప్పండి లేకపోతే బాగోలేదని చెప్పండి కానీ నన్ను టార్గెట్ చేయకండి అంటూ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఏది ఏమైనా సినిమా విషయంలో ప్రభాస్ అభిమానులకు బాబు నన్ను వదిలేయండి అంటు సుజిత మొరపెట్టుకున్నాడు. మరి అదే విధంగా బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ సాహో సినిమాకి రెండు సంవత్సరాలు కేటాయించడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. మరోపక్క మరొకసారి రాజమౌళితో వెంటనే సినిమా చేసి మరో బ్లాక్ బస్టర్ అందుకోవాలని మరి కొంతమంది అభిమానులు ప్రభాస్ కి సూచనలు ఇస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: