టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది హీరోల వారసులు హీరోలుగా వెండి తెరకు పరిచయం అయ్యారు.  ఈ నేపథ్యంలో అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడో తరం నటులుగా నాగ చైతన్య, అఖిల్ హీరోలుగా పరిచయం అయ్యారు.  నాగ చైతన్య చిత్ర పరిశ్రమకు పరిచయం అయి పదేళ్లు దాటుతుంది.  ఏం మాయ చేసావే, మనం తప్ప ఏ సినిమా పెద్ద హిట్ కాలేదు.  ఇటీవల సమంత, నాగ చైతన్య నటించిన ‘మజిలీ’సినిమా మంచి హిట్ అయ్యింది.  ఇక మనం సినిమా క్లయిమాక్స్ లో ఒక్క మెరుపు మెరిసిని అఖిల్ అక్కినేని తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.

హీరోగా వంద శాతం మంచి మార్కులు కొట్టినా..సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది.  ఆ తర్వాత వచ్చిన హలో, మిస్టర్ మజ్ను రెండూ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.  దాంతో అఖిల్ హ్యాట్రిక్ ఫ్లాప్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.  దాంతో తన రాబోయే సినిమా మంచి హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు.  ఇదే పనిలో అక్కినేని నాగార్జున ఎన్నో కథలు వింటున్నారు..మంచి దర్శకుల కోసం చూస్తున్నారు.  ఈ నేపథ్యంలో అఖిల్ నాలుగో మూవీ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ మూవీ చిత్రీకరణలో ఉండగానే అఖిల్ తన ఐదవ సినిమాను పట్టాలెక్కించినట్లు తెలుస్తోంది.  గీత గోవిందం సినిమాతో తిరుగులేని హిట్ కొట్టాడు దర్శకుడు పరశురామ్. అయితే ఆ సినిమా తర్వాత సంవత్సరానికి పైగా గ్యాప్ వచ్చింది. అయినా మరో సినిమాను సెట్ చేసుకోలేకపోయాడు.

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా అనుకున్నా కానీ ఎందుకో అది సెట్ అవ్వలేదు. మరోసారి విజయ్ దేవరకొండ తో ఓ సినిమా, మహేష్ బాబు తో ఓ సినిమా ఉందని వార్తలు వచ్చాయి.  ఇప్పుడు పరశురామ్ అఖిల్ కోసం కొత్త కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. త్వరలో అఖిల్, నాగార్జునకు నరేషన్ ఇవ్వనున్నాడట. అన్నీ అనుకున్నట్లు జరిగితే అఖిల్ నాలుగో సినిమా పూర్తవ్వగానే ఇది సెట్స్ పైకి వెళుతుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: