సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తో 'అర్జున్ రెడ్డి' ని తెరకెక్కించి మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఈసినిమా తరువాత సందీప్ ,సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్లు మహేష్ కు కథ కూడా వినిపించాడు. కానీ మహేష్ కు ఆ కథ నచ్చకపోవడంతో ప్రాజెక్ట్ సెట్ కాలేదు. ఈలోగా సందీప్ రెడ్డి కి బాలీవుడ్ నుండి ఆఫర్ వచ్చింది. అర్జున్ రెడ్డి ని డీల్ చేసిన విధానం బాగా నచ్చడంతో ఆ సినిమా ను సందీప్ రెడ్డి తోనే రీమేక్ చేయాలనీ అక్కడి నిర్మాతలు భావించారు. సందీప్ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. షాహిద్ కపూర్ , కియారా అద్వానీ జంటగా సందీప్, అర్జున్ రెడ్డి ని కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం 200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఈచిత్రం ఈఏడాది అక్కడ అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రాల జాబితాలో చేరింది.
ఇక మొదటి ససినిమాతోనే బాలీవుడ్ సంచలనం సృష్టించడంతో సందీప్ ను తాజాగామరో అవకాశం వరించింది. స్టార్ హీరో రన్బీర్ కపూర్ తో సందీప్ తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడని సమాచారం. క్రైమ్ డ్రామా నేపథ్యం లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని కబీర్ సింగ్ నిర్మాత భూషణ్ కుమార్ నిర్మించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి. మరి ఈ చిత్రంతో కూడా హిట్ కొట్టి సందీప్ అక్కడే సెటిల్ అవుతాడోలేదో చూడాలి. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.