మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా సినిమా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కింది. అక్టోబర్ 2న రిలీజ్ అవుతున్న ఈ సినిమా అవుట్ పుట్ అంతా బాగా వచ్చిందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా విషయంలో చిరుకి ఎక్కడో డౌట్ ఉందట. అందుకే దర్శకధీరుడు రాజమౌళిని సైరా పై ఓ లుక్కేయమని అన్నాడట చిరంజీవి.


సైరా రషెస్ చూశాక రాజమౌళి తనకు తెలిసిన సూచనలను అందించారట. ఆల్రెడీ పరుచూరి బ్రదర్స్ కథ, సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తుంది. వీటితో పాటుగా రత్నవేలు సినిమాటోగ్రఫీ హైలెట్ గా ఉంటుందని టీజర్ చూస్తేనే తెలుస్తుంది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా కాబట్టి ఎక్కడ రిస్క్ తీసుకోకూడదని చిరంజీవి జక్కన్న సలహాలు తీసుకుంటున్నారట.   


బాహుబలి మొదటి రెండు పార్టులతో సంచలనం సృష్టించిన రాజమౌళి.. బాహుబలి తర్వాత అదే రేంజ్ లో వస్తున్న ఈ భారీ సినిమాకు తన సపోర్ట్ ఇస్తున్నారట. రాజమౌళి కోసం స్పెషల్ గా మొత్తం రష్ చూపించి ఫైనల్ కట్ లో అతని ఇన్వాల్వ్ మెంట్ ఉండేలా చూస్తున్నారట. అయితే సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి ఆమోదం మేరకే ఇలా చేస్తునంట్టు తెలుస్తుంది.   


మొదటితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథతో వస్తున్న ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు వంటి స్టార్స్ నటిస్తున్నారు. నయనతార ఫీమేల్ లీడ్ గా నటించిన ఈ సినిమాలో తమన్నా కూడా స్పెషల్ రోల్ ప్లే చేస్తుంది. మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఈ సినిమా బాహుబలిని మించేలా ఉంటుందో లేదో చూడాలి.       
 


మరింత సమాచారం తెలుసుకోండి: