ఒకప్పుడు విజయశాంతి అంటే చిరంజీవి, నాగార్జులకు సమానంగా చూసేవారు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు విజయశాంతి పెట్టింది పేరు. చిత్ర పరిశ్రమలో విజయశాంతిలా రాణించాలని అనుకోని నటీమణులు ఉండరు. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి హీరోలకు ఏమాత్రం తీసిపోని విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్లడంతో దాదాపు 13 ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మళ్లీ ఆమె సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టారు.
దాదాపు పదమూడేళ్ల విరామం అనంతరం ప్రముఖ నటి విజయశాంతి మహేశ్ బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరూ' చిత్రంలో నటిస్తున్న సంగతి విదితమే. ఇదే క్రమంలో రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో కూడా ఆమె నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, ఇందులో వాస్తవం లేదని, ఈ చిత్రంలో తాను నటించడం లేదని విజయశాంతి తాజాగా వివరణ ఇచ్చారు.     


అయితే ఇక్కడ విజయ శాంతి ఒక విషయం గమనించాలి. ఆమె హీరోయిన్‌గా సినిమా పరిశ్రమను ఒక ఊపు ఊపేస్తున్న సమయంలో తనకు ఎన్నో సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చేవి. డబ్బు కోసమో లేక పేరు కోసమో విజయ శాంతి వరుసగా ఏడాదికి 18 సినిమాలు చేసి ఉండొచ్చు. కానీ ఇప్పటి పరిస్థితి అలా కాదు. ఏడాదికి ఒక్క మంచి సినిమా దొరికినా చాలు అనుకునే నటీమణులు ఎందరో ఉన్నారు. కానీ అవకాశాలు రాకో లేద కథలు దొరక్కో చిన్న సినిమాలకు కూడా సంతకాలు చేసేస్తూ నెట్టుకొస్తున్నారు. 2020 సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్ర బృందం. సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో సీనియర్‌ హీరోయిన్‌ విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా… రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్‌ టి., ఎస్‌.కృష్ణ.. టెక్నీషియన్స్ గా పనిచేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: