మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సైరా నరసింహా రెడ్డి మూవీ అక్టోబర్ 2న రిలీజ్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో కూడా ఈ సినిమా భారీ రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేశారు. సినిమాలో అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి వంటి క్రేజీ స్టార్స్ నటిస్తున్నారు. సినిమాలో భారీ యుద్ధ సన్నివేశాలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయని చిత్రయూనిట్ చెబుతున్నారు. 


సైరాలో 10 భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయని తెలిసిందే. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ ఆధ్వర్యంలో వాటిని కంపోజ్ చేశారు. సినిమాకు ఆ యుద్ధ సన్నివేశాలే హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తుంది. ముఖ్యంగా ఇంటర్వల్ బ్యాంగ్ లో వచ్చే యాక్షన్ సీన్స్ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్తాయని తెలుస్తుంది.         


నరసింహా రెడ్డి ఉగ్రరూపంతో ఊగిపోయే ఇంటర్వల్ సీన్ లో డైలాగ్స్ కూడా అదిరిపోతాయట. ఈ సీన్ లో మెగా ఫ్యాన్స్ రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయమని తెలుస్తుంది. అంతేకాదు ఆ సీన్ వస్తున్నంత సేపు మెగా ఫ్యాన్స్ ఎవరు సీట్లలో కూర్చోవడం కష్టమే అని అంటున్నారు. బాహుబలి తర్వాత అంతటి భారీతనంతో వస్తున్న సైరా సినిమాపై ఇప్పటికే తారాస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.   


ఈమధ్య వచ్చిన సాహో సినిమాతో మరోసారి తెలుగు సినిమా స్టామినా ఏంటో బాలీవుడ్ లో చాటాడు ప్రభాస్. అయితే సైరాతో మరోసారి అది ప్రూవ్ కాబోతుందని చెప్పొచ్చు. తప్పకుండా సైరా సంచలనాలకు మెగా ఫ్యాన్స్ అంతా సాక్ష్యులుగా ఉంటారని ఆశిస్తున్నారు. పదేళ్ల తర్వాత ఖైది నంబర్ 150తో బాక్సాఫీస్ బాద్షాగా మరోసారి తన సత్తా చాటిన చిరు సైరాతో ఎలాటి ప్రభంజనాలు సృష్టిస్తాడో చూడాలి.  సినిమాలో నయనతార ఫీమేల్ లీడ్ గా నటించగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా స్పెషల్ రోల్ చేస్తుంది.      



మరింత సమాచారం తెలుసుకోండి: