బాలకృష్ణతో సినిమా చేయడం అంటే మాములు విషయం కాదు. సెట్స్ లో బాలకృష్ణ కోపంగా ఉంటారని నానుడి ఉన్నది. అందుకే ఆయనతో సినిమాలు చేసే హీరోయిన్లు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈ విషయం గురించి చాలామందికి తెలుసు. కొత్తగా బాలయ్యతో సినిమాలు చేసే హీరోయిన్లను ఈ విషయాన్నీ చెప్తారట. అందుకే ఈ విషయంపై చాలా జాగ్రత్తగా ఉంటారు.
బాలకృష్ణతో కలిస్ సమరసింహారెడ్డి సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్ సంఘవి. సంఘవి బాలయ్యతో సినిమా చేసే సమయంలో సెట్స్ లో సైలెంట్ గా ఉండేదట. ఓరోజు బాలకృష్ణ అలా ఎందుకు ఉంటున్నావని అడిగితె.. మీరు సెట్స్ లో కోపంగా ఉంటారు.. అందుకే ఇలా సైలెంట్ గా ఉన్నానని చెప్పింది. దీంతో బాలయ్య అదేం లేదు.. కోపం ఉండే మాట వాస్తవమే.. దానిని కంట్రోల్ చేసుకున్నా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పారట.
అప్పటి నుంచి బాలయ్యతో సెట్స్ లో చాలా సరదాగా ఉండటం మొదలుపెట్టింది సంఘవి. సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా తరువాత బాలకృష్ణతో గొప్పింటి అల్లుడు సినిమాలు చేసింది. సమరసింహా రెడ్డి సినిమాలో ఓ సీన్ ఉందట. అందులో బాలకృష్ణ చెంపపై కొట్టాలి. అలా చేస్తే.. బాలయ్య అభిమానులు ఎక్కడ కోపగించుకుంటారో అని భయపడింది. ఆ సీన్ చేసిన తరువాత అభిమానులు తన వద్దకు వచ్చి ఎక్కడ కొడతారో అని భయపడింది.
కానీ, బాలయ్య ఇది సినిమా అని భయపడాల్సిన అవసరం లేదని.. కథమేరకే అలా చేయాలని చెప్పడంతో సరే అని సంఘవి ఆ సీన్ లో యాక్ట్ చేసిందట. సినిమాలో ఆ సీన్ బాగా వచ్చిందని చెప్పింది సంఘవి. ఇప్పటి వరకు 99 సినిమాలు చేసిన సంఘవి మరో సినిమా చేస్తే 100 సినిమాలు పూర్తవుతాయి. కానీ, 100వ సినిమా మంచి సినిమా చేయాలనే ఆలోచనలతో సినిమా చేయలేదని, మంచి సినిమా రాకపోతే 99 సినిమాలతోనే ఆపేస్తానని అంటోంది సంఘవి.