‘సాహో’ షాక్ నుండి ఇంకా ప్రభాస్ అభిమానులు ఇంకా పూర్తిగా తేరుకోకుండానే పూజ హెగ్డే ప్రభాస్ లేటెస్ట్ మూవీ గురించి ఇస్తున్న లీకులు ప్రభాస్ అభిమానులను మరింత గందరగోళంలో పడేస్తున్నాయి. ‘సాహో’ కి భిన్నమైన రీతిలో ఈమూవీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి కూడ 180 కోట్ల భారీ బడ్జెట్ ను కేటాయించారు. 

ఈ మూవీ 1960 బ్యాక్ డ్రాప్ లో తీస్తున్న పరిస్థితులలో అప్పటి కాలాన్ని ప్రతిబింబించే విధంగా ఈ మూవీ కోసం ప్రత్యేకంగా 25 సెట్లు ఇప్పటికే డిజైన్ చేసారు. ఈ మూవీ కథ అంతా యూరప్ బ్యాక్ గ్రౌండ్ లో ఉండే నేపధ్యంలో 1960 ప్రాంతంలో యూరప్ పరిస్థితులను ప్రతిబింబించే విధంగా ఈమూవీ సెట్స్ ను డిజైన్ చేస్తున్నారు. 

ఒక ప్యూర్ లవ్ స్టోరీగా తీయబడుతున్న ఈ మూవీలో జాతకాలు మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండే హీరో పాత్రలో ప్రభాస్ కనిపించ బోతున్నాడు. ఇప్పటికే యూరప్ లో ఈ సినిమాకు సంబంధించి ఒక షెడ్యూల్ కూడ పూర్తి చేసుకున్న పరిస్థితులలో ఈ మూవీ షూటింగ్ ను వచ్చేనెల నుండి మళ్ళీ మొదలు పెట్టబోతున్నట్లు టాక్. ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న పూజ హెగ్డే ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈసినిమా గురించి ఒక షాకింగ్ విషయం బయటపెట్టింది. 
సాహో’ మూవీలో లెక్కలేనన్ని పాత్రలు కనిపిస్తే ప్రభాస్ లేటెస్ట్ మూవీలో కేవలం 5 పాత్రలు మాత్రమే ఉంటాయని పూజ హెగ్డే లీకులు ఇస్తోంది. సాధారణంగా అవార్డులు వచ్చే ఆర్ట్ ఫిలిమ్స్ లో తక్కువ పాత్రలు ఉంటాయి. అంతేకాదు ఈ సినిమాకు కూడ ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే ఉంటుంది అని పూజ చెపుతోంది. దీనితో దర్శకుడు జిల్ రాథాకృష్ణ ప్రభాస్ ను ఇరికించి మరోషాక్ ఇవ్వబోతున్నాడా అంటూ ప్రభాస్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: