మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా ఎవరూ చూడని స్టార్ డం అనుభవించింది. యంగ్ హీరోలందరితోనూ డ్యూయెట్లు పాడి సూపర్ హిట్లు ఎన్నో కొట్టింది. ఇపుడు ఆమెకు అవకాశాలు బాగా తగ్గిపోయాయి. కొత్త అందాల కోసం టాలీవుడ్ వెతుకులాటలో పడడంతో తమన్నా లాంటి వారి జోరు బాగా తగ్గిపోతోంది. ఇదిలా ఉండగా తమన్నాకు రాక రాక వచ్చిన ఒక మంచి చాన్స్ ని పూజా హెగ్డే కొట్టేసి షాక్ ఇచ్చేసిందని టాక్ నడుస్తోంది.


తమన్నా మహేష్ బాబు కొత్త మూవీ సరిలేరు నీకెవ్వరూలో స్పెషల్ సాంగ్ లో చేసేందుకు మొదట ఒకే అనుకున్నారుట. దాంతో తమన్నా మహేష్ బాబు ల సాంగ్ అంటూ ఓ రేంజిలో ప్రచారం సాగింది. అయితే ఇపుడు సడెన్ గా చిత్ర యూనిట్ పూజా హెగ్డేతో సంప్రదింపులు జరుపుతున్నారట. ఆమె అయితేనే సాంగ్ కి కిక్కు వస్తుందని అనుకుంటున్నారుట. రంగస్థలంలో జిగేల్ రాణి సాంగ్ లో పూజా హెగ్డే ఓ వూపు వూపేసింది. ఆ సినిమా విజయంలో ఈ ఐటం సాంగ్ చాలా పెద్ద రోల్ ప్లే చేసింది. దాంతో పూజా అయితే బాగుంటుందని యూనిట్ అంతా ఒక్క మాట మీదకు వచ్చిందంట. 


పూజాతో రెమ్యునరేషన్ వ్యవహారం ఒక కొలిక్కి రాగానే ఆమెతో మహేష్ స్పేషల్ సాంగ్ షూట్ ఉంటుందని అంటున్నారు.  ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో స్పెషల్ అవకాశం వస్తే నో చెప్పే అవకాశం దాదాపుగా ఉండదు.  ఈ విషయంలో త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా మహేష్ మహర్షి మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే. ఇపుడు మరో మారు హ్యాంద్ సం హీరోతో చిందేయబోతోంది మరి.  ఫ్యాన్స్ కి పండుగే కదా.



మరింత సమాచారం తెలుసుకోండి: