నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ - ''ఈరోజుతో మా ప్రమోషన్ పార్ట్ ముగుస్తుంది. రెండు రోజుల్లో సినిమా రాబోతుంది. మిగతాది సినిమానే చూసుకుంటుంది. రిలీజ్కి ముందు తిరుపతి, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, వైజాగ్ అన్ని చోట్ల మా టీమ్కి మీడియా నుండి, ప్రేక్షకులనుండి వామ్ వెల్కమ్ లభించింది. ఈ సందర్భంగా అందరికి థాంక్స్. ఇప్పుడు టీమ్ అందరం హైదరాబాద్కి వచ్చాం. హైదరాబాద్ మీడియాని కలవకపోతే ఈ కంప్లీట్ సర్కిల్ పూర్తి అవదు అనిపించి మన మీడియా మిత్రులని కలుద్దామని ఈ ప్రెస్మీట్ ఏర్పాటు చేశాం. సినిమా అవుట్ ఫుట్తో అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఎప్పుడెప్పుడు థియేటర్స్లో మీ నవ్వులు చూద్దామా అని ఎగ్జైటెడ్గా ఉన్నాం. ఎగ్జైట్ తో పాటు నెర్వస్గా కూడా ఉంది. ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా ఈ సినిమా పూర్తి అయింది అంటే దానికి కారణం మైత్రి టీమ్. విక్రమ్ సర్ కెరీర్లో ఇది ఫాస్టెస్ట్ ఫిలిమ్. షూటింగ్ ప్రతి ఒక్కరం ఎంజాయ్ చేస్తూ చేశాం. ఈ సినిమా మా అందరికి పెయిడ్ హాలిడేలా అనిపించింది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ విషయంలో విక్రమ్ చాలా లక్కీ డైరెక్టర్. సరైన టీమ్ కుదిరింది. కార్తికేయ బిజీగా ఉండికూడా కథ విని ఎగ్జయిట్ అయి ఒప్పుకున్నాడు. రేపు మీరు కొత్త కార్తికేయనుచూడబోతున్నారు. కూబా పోలెండ్ నుండి వస్తున్నారు అనగానే కొంచెం బయపడ్డాం. అతని వల్లే సినిమా బ్రాండ్ న్యూగా ఉంది. అనిరుద్ మాకు బ్యాక్బోన్లా అయ్యారు. ప్రతి సాంగ్ సెన్సేషన్ అవుతుంది. నాకు రిలీజ్ ముందు రెండు రోజులు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆ టెన్షన్లో ఒక కిక్ ఉంటుంది. ఈ రెండు రోజులు నేను ఎంజాయ్ చేస్తాను. సెప్టెంబర్ 13 నుండి మీరు ఎంజాయ్ చేయండి '' అన్నారు.