బిగ్ బాస్ సీజన్ 3 ప్రస్తుతం 8 వ వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే షో మొదటి పార్ట్ పూర్తి కావడంతో టైటిల్ కొట్టాలనే కసితో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన హౌస్ మేట్స్ ఇక నుండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి.  బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు సరిగ్గా నిర్వర్తిస్తూ ముందుకుసాగాలి లేకపోతే అలీ లా అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యి బయటకి పోవాల్సి రావచ్చు. ఇక పొతే ఈ వారం హౌస్ మేట్స్ కి ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో సగం మంది దెయ్యాలుగాను , మిగిలిన ఇంటి సభ్యులు మనుషులుగాను ఉంటారని చెప్పాడు. ఇందులో భాగంగా టాస్క్ ఇచ్చిన తోలి రోజే పునర్నవి రెచ్చిపోయింది. నేను ఈ టాస్క్ ఆడను అంటూ బిగ్ బాస్ కే వార్నింగ్ ఇచ్చింది. ఇక నేడు కూడా అదే రేంజ్ లో రెచ్చిపోయింది.

బిగ్ బాస్ చెప్తున్నా విను ఇలాంటి ముష్టి టాస్క్‌లు ఇచ్చి మేం నూరు శాతం ఎఫర్ట్ పెడితే మీకు ఇష్టం వచ్చినట్టు రద్దు చేస్తారు. అలాంటప్పుడు మాకు కూడా కాలుతుంది. ఎమోషనల్ డ్రైన్ చేయడం కరెక్ట్ కాదు అని, కొంచెం సెన్స్ ఉన్న టాస్క్‌లు ఇవ్వండి. నా రియాక్షన్ తప్పైతే బయటకు పోతా. టాస్క్ అన్నప్పుడు క్లియర్‌గా ఇవ్వాలి. క్లారిటీ ఇవ్వాలి.. సిల్లీ గేమ్స్ ఇవ్వకు అంటూ బిగ్ బాస్ కే సూచనలు ఇచ్చింది. ఆ ఆతరువాత రాహుల్ తో మాట్లాడుతూ ... మన ఇద్దరి మధ్య సంథింగ్ ఏదో జరుగుతుందని అందరూ అనుకుంటుంటే.. నేను నీకు కాస్త దూరంగా ఉంటున్నా దానికి నువ్వు  నన్ను షేడ్ అని అంటుంటే నేను ఏం అనుకోవాలి. నువ్వు  చిరాకు తెప్పిస్తే రాహుల్ పక్కకుపో అంటా.. అంతేతప్ప నిన్ను ఇగ్నోర్ చేయడం లేదు. నువ్వు  దేనికి ఎలా రియాక్ట్ అవుతావో నాకు తెలియడం లేదు. అసలు మన మధ్య ఏం జరుగుతుందో నాకే అర్ధం కావడం లేదు’ అంటూ చెప్పింది.దీనికి రాహుల్  పున్నూ నువ్వు  నన్ను ఇగ్నోర్ చేస్తున్నావ్.. నా లైఫ్‌లో ఫస్ట్ టైం నా బిహేవియర్ బాలేదని చెప్పింది నువ్వే అంటూ చెప్పుకొచ్చాడు. 

ఆ తరువాత కాసేపటికి హౌస్ మేట్స్ కి ఇచ్చిన  ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం అనే టాస్క్ ముగిసినట్టు చెప్పాడు. అలాగే టాస్క్ కోసం బాబా భాస్కర్ , హిమజ చాలా కష్టపడ్డారు అంటూ చెప్పాడు. ఇక ఈ టాస్క్ లో శ్రీముఖి, పునర్నవి, మహేష్ లని వరెస్ట్ ఫోర్ఫామెర్స్ గా అనౌన్స్ చేసాడు. అలాగే ఈ వారం లగ్జరీ బడ్జెట్ కూడా వీరి ముగ్గురికి ఉండదు అని చెప్పాడు. అలాగే వీరి ముగ్గురి మరో టాస్క్ కూడా ఇచ్చాడు. అదేమిటి అంటే బిగ్ బాస్ కొన్ని షూస్ ఇచ్చి వాటికీ పాలిష్ చేయాలనీ , అలాగే హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ యొక్క షూస్ ని కూడా పాలిష్ చేయాలని చెప్పాడు. దీనికి శ్రీముఖి ఒకే అంటూ టాస్క్ కి రెడీ అయ్యింది. కానీ , మహేష్ , పునర్నవి మాత్రం ..అసలు మనం ఎందుకు వచ్చాం ..ఈ షూస్ పాలిష్ చేయడం ..చెడ్డీలు ఉతకడం ఏంటి అంటూ రెచ్చిపోయాడు. అలాగే పునర్నవి కూడా నాకు టాస్క్ లో చాలా దెబ్బలు తాకాయి..అయినా నన్ను ఎందుకు సెలెక్ట్ చేసారు ..నేను చేయను అంటే చేయను అని కూర్చుంది. చివరికి మహేష్ ని హౌస్ మేట్స్ అందరూ కలిసి ఒప్పించారు. కానీ , పునర్నవి మాత్రం నేను చేయను అని అలాగే ఫిక్స్ అయ్యి పోయింది. దీనితో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ చేయకపోతే .. తరువాత వారం నామినేషన్స్ లో ఉంటారు అని చెప్పగా ..నేను ఇప్పుడు కూడా నామినేషన్స్ లో ఉన్నా నో ప్రాబ్లమ్స్ అంటూ పట్టు విడవలేదు. మహేష్ , శ్రీముఖి మాత్రం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా షో పాలిష్ చేయడం స్టార్ట్ చేసారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: