అమీర్ ఖాన్ హీరోగా  టీ-సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ బయెపిక్ "మొఘల్" సినిమాని  ప్లాన్ చేశాడు. కానీ ఆ సినిమా డైరెక్టర్ సుభాష్ కపూర్ పైన లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. అమీర్ ఖాన్ ప్రోడక్షన్ లో లైంగిక వేదింపులను సహించము, లైంగిక వేదింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి సినిమాలో నేను నటించను అని ఆయన "మొఘల్" సినిమా నుండి తప్పుకున్నారు. ఈ సంఘటన జరిగి ఇప్పటికి సంవత్సరం అవుతుంది. అయితే ఈ సినిమాను మళ్లీ పట్టాలు ఎక్కిస్తున్నట్టు ఆయన తెలుపడంతో వివాదం మొదలైయింది.


బాలీవుడ్ హీరోయిన్  తనుశ్రీ దత్త లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శకుడి సినిమాలో ఎలా నటిస్తారని అమీర్ ఖాన్ పై మండి పడ్డారు.సుభాస్ కపూర్ పై మీటూ ఆరోపణలు వచ్చినపుడు తనకు నిద్ర పట్టలేదు అని అమీర్ ఖాన్ అనడం చాలా భాధకరం అని ఆమె అన్నారు.  చాలా మంది మహిళలు తమ పైన లైంగిక దాడులు జరిగాయి అని బయటికి వచ్చి చెప్పినపుడు అమీర్ ఖాన్ కు నిద్ర ఎలా పట్టిందని ఆయనను ప్రశ్నించింది. 


లైంగిక వేధింపులు చేసిన వారికి పని దొరుకుతుంది కానీ లైంగిక దాడులు ఎదుర్కొన్న ఆడవారికి ఎవరు పని ఇవ్వడం లేదని ఆమె అన్నారు.తనుశ్రీ దత్త తనను నానా పటేకర్ "ఒకే హరన్ ప్లీజ్" సినిమా సమయంలో లైంగికంగా వేధించాడని లాస్ట్ ఇయర్ #మీటూ ఉద్యమం సందర్భంగా ఆరోపణలు చేశారు.ఆమె ఆరోపణలు బాలీవుడ్ లో పెద్ద దూమరాన్ని లేపాయి.


దర్శకుడు సుభాస్ కపూర్ పైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన గీతిక మీడియాతో మాట్లాడుతూ..  సూభాస్ కపూర్ ను "మొఘల్" సినిమాకు దర్శకుడిగా తీసుకునే ముందు అసలేం జరిగిందని రెండు వైపుల విచారణ జరిపి ఉంటే బాగుండేదని ఆమె తన ఆవేదనను వ్యక్తపరిచారు.


మరింత సమాచారం తెలుసుకోండి: