రేపు విడుదలకాబోతున్న ‘గ్యాంగ్ లీడర్’ మూవీ రిజల్ట్ గురించి నాని కంటే ఎక్కువ టెన్షన్ సుకుమార్ పడుతున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో సెటైర్లు పడుతున్నాయి. ఇలాంటి కామెంట్స్ సుకుమార్ పై రావడానికి ఒక ఆసక్తికర గల కారణం కనిపిస్తోంది.  ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన విషయం తెలిసిందే. 

అయితే వరసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన ఈ నిర్మాణ సంస్థ గత కొంత కాలంగా వరస పరాజయాలు ఎదుర్కుంటోంది. ఈనష్టాల సమస్యల వల్ల ఈ సంస్థ నిర్మాతల మధ్య కూడ భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి అంటూ ఇండస్ట్రీలో గాసిప్పులు కూడ వచ్చాయి.

ఇలాంటి పరిస్థితులలో సుకుమార్ అతి త్వరలో అల్లు అర్జున్ తో తీయబోతున్న మూవీ నిర్మాతలు కూడ మైత్రి మూవీస్ సంస్థ కావడంతో ఆ సంస్థకు సమస్యలు లేకుండా ఉండాలి అంటే ‘గ్యాంగ్ లీడర్’ హిట్ కావాలని సుకుమార్ కోరుకుంటున్నట్లు టాక్. దీనికితోడు సుకుమార్ బన్నీతో తీయబోతున్న మూవీకి భారీ బడ్జెట్ పెట్టాలని ఇప్పటికే మైత్రీ మూవీ సంస్థకు చెప్పాడు. 

అయితే వరస పరాజయాలలో ఉన్న మైత్రీ మూవీస్ సంస్థ ‘గ్యాంగ్ లీడర్’ కూడా పరాజయం చెందితే తాను బన్నీతో తీయబోతున్న మూవీ బడ్జెట్ విషయంలో కోత పెడతారేమో అన్న భయం కూడ సుకుమార్ కు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికితోడు సుకుమార్ మైత్రీ మూవీస్ సంస్థను ఆధారంగా చేసుకుని తన సొంత నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై కొన్ని చిన్న సినిమాలు తీసే కార్యక్రమం మొదలు పెట్టాడు. ప్రస్తుతం సుకుమార్ తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన బుచ్చిబాబును దర్శకుడుగా మార్చి ‘ఉప్పెన’ అన్న చిన్న సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ప్రాజెక్ట్ వెనుక మైత్రీ మూవీస్ హస్తం ఉంది అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో ‘గ్యాంగ్ లీడర్’ ఫెయిల్ అయితే తన ప్రాజెక్ట్స్ అన్నీ అనుకున్నట్లుగా జరగవని సుకుమార్ భయం అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: