దిల్ రాజు నిర్మించే సినిమాలంటే ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో అంచనాలుంటాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ని తన ఆలోచనలతో, నిర్ణయాలతో ఓ రేంజ్ లో ఉంచాడు. ఫెయిల్యూర్స్ వచ్చినా కానీ వెరవని దిల్ రాజు ఓ సబ్జెక్ట్ ని ఒకే చేస్తే బ్లైండ్ గా వెళ్ళిపోతాడు. తాను రివీల్ చేసే వరకూ తన ప్రాజెక్ట్ విశేషాలు బయటకు రావు. కానీ జెమినీ టీవీ అత్యుత్సాహం వల్ల దిల్ రాజు అనౌన్స్ చేయకుండానే ఓ సినిమా విశేషాలు బయటకొచ్చేశాయి.

 

 

అక్కినేని నట వారసుడు నాగ చైతన్య, యూత్ లేటెస్ట్ క్రేజీ బ్యూటీ రష్మిక మందనా హీరో, హీరోయిన్లుగా దిల్ రాజు ఓ సినిమా ప్లాన్ చేసాడు. సినిమా టైటిల్ ను 'అదే నువ్వు, అదే నేను' గా ఫిక్స్ చేశారు. అయితే ప్రస్తుతానికి ఈ సినిమా గురించిన విశేషాలేవీ ఇంకా దిల్ రాజు సంస్థ నుండి అఫీషియల్ గా బయటకు రాలేదు. హీరో హీరోయిన్లు ఇద్దరూ వేరే వేరే కమిట్ మెంట్స్ తో బిజీగా ఉండడం వల్ల ఇంకా ఈ ప్రాజెక్ట్ పేపర్ మీదే ఉంది. కానీ జెమినీ టీవీ.. 'అదే నువ్వు అదే నేను సినిమా డిజిటల్ హక్కులను మేము తీసుకున్నాం' అంటూ అఫీషియల్ గా తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్లో అనౌన్స్ చేసింది. దీంతో ఈ సినిమా అనౌన్స్ మెంట్ నిర్మాణ సంస్థ కాకుండా డిజిటల్ రైట్స్ కొనుక్కున్న సంస్థ ద్వారా బయటకువచ్చినట్టైంది.

 

 

మరి.. దీనిపై దిల్ రాజు రియాక్షన్ ఏంటో తెలియదు కానీ ప్రస్తుతానికి ఇది  ఆయనకు ఓ షాక్ లాంటి వార్తే. ఏమైనా.. నాగ చైతన్య - రష్మిక కాంబినేషన్ కి మంచి హైప్ రావడం ఖాయం. ఇక ఈ సినిమా పూర్తి డిటెయిల్స్ తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: