పూరి హీరోయిన్ అంటే ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరి సరసన ఛాన్స్ దక్కాల్సిందే. అంతగా పాపులారిటి ని ఇస్తాడు పూరి. అయితే చాలా కాలంగా ఇలియానా లేని లోటు మాత్రం టాలీవుడ్ లో పూరి ఇంతకాలం భర్తీ చేయలేకపోయాడు. తిరిగి పూరికి ఇన్నాళ్ళకు మళ్ళీ ఆ ఛాన్స్ వచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే చాలా కాలంగా తెలుగు సినిమాకి గ్లామర్ కంటెంట్ తక్కువైపోయింది. పూరి మార్క్ మాస్ మసాలాయిజం కూడా దూరమైపోవడంతో గ్లామర్ హీరోయిన్స్ కూడా తగ్గిపోయారు. అందుకే నభాని పూరి ఇస్మార్ట్ శంకర్ సినిమాకి ఎంపిక చేయగానే ఎక్కడా లేని ఉత్సాహం తిరిగొచ్చింది. 

కన్నడ పరిశ్రమ నుంచి వస్తూనే వరుసగా ఫోటోషూట్లతో పిచ్చెక్కించిన నభా వెంటనే పూరీ కి కనెక్ట్ అయింది. అంతగా వాడి వేడి లేని భామల జోలికి వెళ్లని పూరి ఏమాత్రం ఆలోచించకుండా తన సినిమాలో పెట్టేశాడు. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నభా వొగలు గురించి తెలిసిందే. పక్కా ఊర మాస్ యాటిట్యూడ్ తో మాసివ్ పర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకుంది. ఇల్లీ బేబీని తీర్చిదిద్దిన పూరి చేతిలో పడింది కాబట్టి నభా కి కూడా అంత పాపులారిటి వచ్చేసింది. అందుకే ఇప్పుడు నభా కెరీర్ టాలీవుడ్ లో కొత్త మలుపు తిరుగుతోంది. నిన్న మొన్నటి వరకూ సరైన ఆఫర్లు లేవనుకుంటుండగానే.. ఇప్పుడు ఏకంగా మెగా కాంపౌండ్ లోకే ఎంటరైపోతోంది.

మాస్ మహారాజా రవితేజ సరసన డిస్కో రాజా సినిమాతో హాట్ హాట్ గా నటిస్తున్న ఈ బ్యూటీని వెతుక్కుంటూ సూట్ కేసులు ఇంటి తలుపు తడుతున్నాయని లేటెస్ట్ న్యూస్. కానీ నభా సెలెక్టివ్ గా ఉంటుందట. అందులో భాగంగానే ఇటీవలే అక్కినేని అఖిల్ సరసన చాన్స్ దక్కనుందని ఒక న్యూస్ బాగా స్ప్రెడ్ అయింది. ఆ ఆఫర్ సంగతేమో కానీ.. తాజాగా సుప్రీం హీరో సాయిధరమ్ సరసన నభా ఓ క్రేజీ ప్రాజెక్ట్ కి సంతకం చేసింది. ఈ చిత్రంతోనే సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అక్టోబర్ లో సినిమా ప్రారంభం కానుంది. మెగా నిర్మాత బీవీఎస్.ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రవితేజ తర్వాత మళ్లీ అంతే ఎనర్జిటిక్ హీరో సరసన అవకాశం పట్టేసింది. ఒక్కసారి గనక మెగా కాంపౌండ్ లోకి ఎంటరైతే ఏ హీరోయిన్ జాతకమైనా మారిపోవాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: