మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమా ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. మరికొద్దిరోజుల్లో సినిమాలోని పాటలు ఒక్కొక్కటిగా యూట్యూబ్ లో రిలీజ్ కానున్నట్లు సమాచారం. మెగాస్టార్ సరసన స్టార్ హీరోయిన్ నయనతార ఫస్ట్ టైం జతకడుతున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ ఖర్చుతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో నరసింహారెడ్డి కి గురువైన గోసాయి వెంకన్న పాత్రలో నటిస్తుండగా, కన్నడ నటుడు కిచ్చా సుదీప్ అవుకు రాజుగా, తమిళ నటుడు విజయ్ సేతుపతి రాజా పాండిగా, అలానే విలక్షణ నటుడు జగపతిబాబు వీరా రెడ్డిగా నటిస్తున్నారు. స్వాతంత్రోద్యమ బ్యాక్ డ్రాప్ లో పాన్ ఇండియా అపీల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ తదితర ఇతర భాషల్లో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇక అతి త్వరలో ఆయా భాషల్లో ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేయనున్నట్లు సమాచారం. ఇకపోతే ఈనెల 18వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో ఎంతో గ్రాండ్ గా నిర్వహిస్తున్నట్లు, సైరా యూనిట్ ఒక అధికారిక ప్రకటన రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాజమౌళి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వివి వినాయక్ తదితరులు ఈ వేడుకకు ప్రత్యేక అతిథులుగా రానున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే కాసేపటి క్రితం తమ ప్రకటనలో చిన్న సవరణ చేస్తూ, తమ సైరా ప్రి రిలీజ్ ఈవెంట్ కి, తన అఫీషియల్ కమిట్మెంట్స్ కారణంగా శ్రీ కేటీఆర్ గారు హాజరు కావడం లేదంటూ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ వారు తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో కాసేపటి క్రితం మరొక పోస్ట్ పెట్టడం జరిగింది. దీనితో పవన్, కేటీఆర్ లను ఒకే వేదికపై చూడాలి అని అనుకున్న ఫ్యాన్స్ కు కొంత నిరాశ ఎదురయినట్లయింది. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, ఈ సినిమాను అక్టోబర్ 2 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: