హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో మెహ్రీన్ కథానాయికగా నటించగా బాలీవుడ్ బ్యూటీ జరీన్ ఖాన్ ముఖ్య పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంట్టున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మిస్తునుండగా పడి పడి లేచె మనసు ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 4న విడుదలకానున్న ఈ చిత్రం ఫై గోపిచంద్ భారీ ఆశలు పెట్టుకున్నాడు.
ఇక ఈసినిమా ను పూర్తి చేశాడో లేదో మరో సినిమా కు రెడీ అయిపోయాడు గోపిచంద్. నూతన దర్శకుడు బిను సుబ్రహ్మణ్యం డైరెక్షన్ లో తన తదుపరి చిత్రంలో నటించనున్నాడు గోపిచంద్. ఈ చిత్రం ఈ రోజు లాంచ్ అయ్యింది. సెప్టెంబర్ 20 నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఎస్విసిసి పతాకం ఫై సీనియర్ ప్రొడ్యూసర్ బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.