సూపర్ స్టార్ రజినీ కాంత్, స్టార్ డైరెక్టర్  ఏఆర్ మురగదాస్  కాంబినేషన్ లో  తెరకెక్కుతున్న చిత్రం 'దర్బార్'.  గత కొద్దీ రోజులనుండి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న  ఈ చిత్రం  తుది దశకు చేరుకుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈసినిమా చివరి షెడ్యూల్ ముంబై లో జరుగుతుంది.  ఈనెల చివర్లో కల్లా ఈసినిమా షూటింగ్ దాదాపుగా  పూర్తికానుంది. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 10న విడుదలచేయనున్నారని సమాచారం.



కాగా  తెలుగులోనూ అదే తేదీ కి విడుదలకానున్నడంతో ఈచిత్రానికి  అక్కడ పెద్ద సవాలే ఎదురుకానుంది.  ఎందుకంటె సంక్రాంతి టార్గెట్ గా  మహేష్ బాబు , సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్  అల.. వైకుంఠపురములో.. చిత్రాలు బరిలో  వున్నాయి.  దాంతో దర్బార్ ఈ సినిమాలతో  పోటీ పడనుంది. ఒకవేళా సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం రజినీకి  తెలుగులో  కూడా మంచి మార్కెట్ వుంది కాబట్టి   అదిరిపోయే కలెక్షన్లను రాబట్టడం ఖాయం.



యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజినీ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా ఆయనకు జోడిగా నయనతార కనిపించనుంది.  ఇక వీరితోపాటు బాలీవుడ్ ప్రముఖ నటులు సునీల్ శెట్టి , ప్రతీక్ బబ్బర్ , దిలీప్ తాహిల్ , జతిన్ సర్ణ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.  అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.  ఈసినిమా ఓవర్సీస్ హక్కులను ఫార్స్ ఫిలిమ్స్  38కోట్లకు సొంతం చేసుకుంది.  దాంతో  ఇప్పటివరకు అక్కడ హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిపిన కోలీవుడ్  చిత్రంగా దర్బార్ రికార్డు సృష్టించింది.  కాగా మొదటి సారి రజినీ -మురగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో  దర్బార్ ఫై భారీ అంచనాలు వున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: