కాగా తెలుగులోనూ అదే తేదీ కి విడుదలకానున్నడంతో ఈచిత్రానికి అక్కడ పెద్ద సవాలే ఎదురుకానుంది. ఎందుకంటె సంక్రాంతి టార్గెట్ గా మహేష్ బాబు , సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల.. వైకుంఠపురములో.. చిత్రాలు బరిలో వున్నాయి. దాంతో దర్బార్ ఈ సినిమాలతో పోటీ పడనుంది. ఒకవేళా సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం రజినీకి తెలుగులో కూడా మంచి మార్కెట్ వుంది కాబట్టి అదిరిపోయే కలెక్షన్లను రాబట్టడం ఖాయం.
యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజినీ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా ఆయనకు జోడిగా నయనతార కనిపించనుంది. ఇక వీరితోపాటు బాలీవుడ్ ప్రముఖ నటులు సునీల్ శెట్టి , ప్రతీక్ బబ్బర్ , దిలీప్ తాహిల్ , జతిన్ సర్ణ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ఈసినిమా ఓవర్సీస్ హక్కులను ఫార్స్ ఫిలిమ్స్ 38కోట్లకు సొంతం చేసుకుంది. దాంతో ఇప్పటివరకు అక్కడ హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిపిన కోలీవుడ్ చిత్రంగా దర్బార్ రికార్డు సృష్టించింది. కాగా మొదటి సారి రజినీ -మురగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో దర్బార్ ఫై భారీ అంచనాలు వున్నాయి.