మ్యాచో హీరో గోపీంచ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాత శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్.ఎల్‌.పి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.26గా సీనియ‌ర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తున్న కొత్త చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ఈరోజు నుండి ప్రారంభ‌మైంది. బిను సుబ్ర‌మ‌ణ్యం ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమాను ఇండియా స‌హా నేపాల్‌, కాంబోడియా, థాయ‌లాండ్‌లో  చిత్రీక‌రిస్తారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి స‌తీశ్ కురుప్ కెమెరా వ‌ర్క్‌ను అందిస్తున్నారు. హీరోయిన్ స‌హా మిగిలిన న‌టీన‌టుల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని యూనిట్ తెలియ‌జేసింది. 


సాహ‌సం త‌ర్వాత గోపీచంద్, బి.వి.ఎస్‌.ఎన్ ప్ర‌సాద్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్ర‌మిది. గోపీచంద్‌ను స‌రికొత్త కోణంలో ఆవిష్క‌రించ‌నున్నామ‌ని, అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించే చిత్ర‌మ‌వుతుంద‌ని ద‌ర్శ‌కుడు బిను సుబ్ర‌హ్మ‌ణ్యం తెలిపారు. 


ద‌ర్శ‌క‌త్వం:  బిను సుబ్ర‌మ‌ణ్యం, నిర్మాత‌:  బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీ:  స‌తీశ్ కురుప్‌,  సంగీతం:  మ‌ణిశ‌ర్మ‌, ఆర్ట్‌:  అవినాష్ కొల్ల‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  సి.హెచ్‌.న‌ర‌సింహాచారి, పి.ఆర్.ఒ:  వంశీ కాకా.


ఇదిలా ఉంటే... గోపీచంద్, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న స్పై థ్రిల్లర్ మూవీకి టైటిల్ ఫిక్స్ అయ్యింది. తమిళ దర్శకుడు తిరుని ఈ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ లోగోను విడుదల చేసింది చిత్ర యూనిట్. దాదాపు సగం షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో గోపీచంద్ సరసన మెహ్రీన్ నటిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ జరీనా ఖాన్ కీలకపాత్రలో నటిస్తోంది. ‘చాణక్య’ అనే పవర్ ఫుల్ టైటిల్‌తో ఈ సినిమా గోపీచంద్ కెరియర్‌లో మైలురాయిగా నిలిచిపోనుందని.. ఇండో-పాక్ నేపథ్యంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రానికి హైలెట్స్ నిలుస్తాయంటుున్నారు. టెక్నికల్ పరంగా ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా.. వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ సందిస్తున్నారు. అబ్బూరి రవి ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా.. నవంబర్ లేదా డిసెంబర్‌లో ఈ సినిమా థియేటర్స్‌కి వచ్చే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: