మెగా హీరో వరుణ్ తేజ్ , ట్యాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్నచిత్రం వాల్మీకి. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమవుతుంది. ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 15న హైదరాబాద్ లోని శిల్పకళా వేదిక లో జరుగనుంది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా విక్టరీ వెంకటేష్ రానున్నాడు. ఇటీవల వెంకీ -వరుణ్ కలిసి ఎఫ్ 2అనే చిత్రంలో నటించగా అదిఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇక వెంకటేష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వస్తే ఆ సినిమా హిట్ అవుతుందనే సెంటిమెంట్ కూడా ఇండస్ట్రీ లో వుంది. మరి ఈ సారి కూడా ఆ సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందో లేదో చూడాలి.
కోలీవుడ్ బ్లాక్ బాస్టర్ మూవీ 'జిగర్తండా' కు రీమేక్ గా తెరకెక్కుతున్నవాల్మీకిలో బాబీ సింహ పాత్రలో వరుణ్ తేజ్ నటిస్తుండగా సిద్దార్థ్ పాత్రలో తమిళ యువ హీరో అథర్వ మురళి కనిపించనున్నాడు. కాగా అథర్వ ఈచిత్రంతో తెలుగులో పరిచయం అవుతున్నాడు. వీరికి జోడిగా పూజా హెగ్డే , మృణాళిని రవి నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ఫై రామ్ ఆచంట , గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈచిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ చిత్రం ఈనెల 20న విడుదలవుతుండగా అదే రోజు తమిళ స్టార్ హీరో సూర్య నటించిన బందోబస్త్ కూడా థియేటర్లలోకి వస్తుండడంతో ఈరెండు సినిమా లు బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా అన్నట్లుగా తలపడనున్నాయి. అయితే తమిళ సినీ వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం బందోబస్త్ సూపర్ హిట్ అవ్వడం గ్యారెంటీ అనే టాక్ వినబడుతుంది. ఈ లెక్కన వాల్మీకి కి కూడా హిట్ టాక్ వస్తేనే పోటీలో నిలబడగలదు.