నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ సినిమా ఎన్నో అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఆ అంచనాలను అందుకోవడంలో పూర్తిగా సఫలం అయింది. వెరైటీ సినిమాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించడం జరిగింది. నూతన నటి ప్రియాంక అరుళ్ మోహన్, నాని సరసన జోడి కట్టిన ఈ సినిమాలో సీనియర్ నటి లక్ష్మి, శరణ్య మోహన్, వెన్నెల కిశోర్, కార్తికేయ, సత్య తదితరులు ఇతర పాత్రల్లో నటించడం జరిగింది. 

ఒక రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలోని కథ మరియు కథనాలు, థియేటర్ కు వచ్చే ప్రేక్షకుడిని ఎంతో కట్టి పడేశాయి. అక్కడక్కడా కొద్దిపాటి ల్యాగ్ ఉన్నప్పటికీ ఓవర్ ఆల్ గా మాత్రం సినిమా ప్రేక్షకుడికి మదిని తాకింది. ఇక ఇటీవల కొన్నాళ్లుగా సరైన విజయం లేని మైత్రి మూవీ మేకర్స్ వారి నెత్తిన, ఈ సినిమా విజయంతో నాని పలు పోశారు అనే చెప్పాలి. గత ఏడాది మార్చి 30న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కలయికలో రంగస్థలం సినిమాను నిర్మించిన ఆ సంస్థ, ఆ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకుంది. అయితే అప్పటినుండి ఇప్పటివరకు వారి బ్యానర్ నుండి సవ్యసాచి, 

అమర్ అక్బర్ ఆంథోనీ, చిత్రలహరి, డియర్ కామ్రేడ్, సినిమాలు రావడం జరిగింది. వాటిలో చిత్రలహరి ఒక మోస్తరు విజయాన్ని అందుకోగా, మిగిలిన సినిమాలన్నీ ఘోరంగా దెబ్బతిన్నాయి. ఆ విధంగా వరుసగా అపజయాలు చవి చూస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వారికి, నాని గ్యాంగ్ లీడర్ సినిమా సూపర్ హిట్ సాధించి మంచి బూస్ట్ ని అందించింది అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ సంపాదించిన ఈ సినిమా, రాబోయే రోజుల్లో ఎంతమేర కలెక్షన్ సాధిస్తుందో తెలియాలంటే మరికొద్దిరోజులు ఓపికపట్టాల్సిందే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: