ఆలీ మరోసారి హీరోగా పూర్తీ వినోదాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం ‘పండుగాడి ఫోటో స్టూడియో’. ‘వీడు ఫోటో తీస్తే పెళ్ళి అయిపోద్ది’ అనేది ట్యాగ్‌లైన్. పెదరావూరు ఫిలిం సిటీ సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర విద్యాలయం ఆర్ట్స్ పతాకంపై దిలీప్ రాజా దర్శకత్వంలో గుదిబండి వెంకట సాంబిరెడ్డి రూపొందించిన ఈ చిత్ర ఆడియో వేడుక శనివారం సాయంత్రం హైదరాబాద్ దసపల్లా హోటల్‌లో ఘనంగా జరిగింది. ఆడియో సిడీని ప్రముఖ దర్శకులు పూరి జగన్నాథ్, బోయపాటి శీను సంయుక్తంగా విడుదల చేశారు. ట్రైలర్‌ను ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి విడుదల చేశారు. ఈ వేడుకలో ముఖ్య అథితులుగా బాపట్ల ఎంపీ నందిగం సురేష్, హీరో శ్రీకాంత్, నటుడు నరేష్, అల్లరి నరేష్, బాబు మోహన్, ఛార్మి, ఖయ్యుమ్, ప్రవీణ, అనిల్ కడియాల తదితరులు హాజరయ్యారు.


ఈ నెల లో  వస్తున్న'' పండుగాడు'. శ్రీ వెంకటేశ్వర విద్యాలయమ్స్ ఆర్ట్స్ పతాకం పై అలీ ,రిషిత (భవ్యశ్రీ )జంటగా బాబూమోహన్ ,వినోద్కుమార్ ,జీవ ,సుధా ,చిత్రం శీను ,శ్రీలక్ష్మి మొదలగు భారీ తారాగణం తో గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించిన చిత్రం 'పండుగాడి ఫోటో స్టూడియో ''. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రo ఇదే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నది .కుటుం సమేతంగా చూడదగ్గ పూర్తి స్థాయీ కామెడీ ఎంటర్ టైనర్గా దర్శకుడు దిలీప్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు .ఈ చిత్రంలో అలీ ఎవరికి ఫోటో తీసినా వారికి వెంటనే వివాహం నిశ్చయం అయ్యే ప్రధాన అంశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది . చక్కటి పాటలు ,అద్భుతమైన ఫైట్స్ తో అలీ ప్రేక్షకులను అలరిస్తారు .తమ మొదటి చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే ఆశాభావాన్ని నిర్మాత గుది బండి వెంకట సాంబిరెడ్డి ఒక ప్రకటనలో తెలియ జేశారు .


మరింత సమాచారం తెలుసుకోండి: