ప్రస్తుతం తెలుగు సినిమాల్లో రెండు రకాల సినిమాలు వస్తున్నాయి. ఒకటి కథతో సంబంధం లేకుండా భారీ బడ్జెట్ తో భారీ హంగామా చేసి సినిమాలు చేయడం. మరో విధానం ఏంటంటే కంటెంట్ బేస్ సినిమాలు చేయడం. స్టార్ సినిమాకు కంటెంట్ ఉన్న కేటగిరిలు చాలా తక్కువ. అయితే లేటెస్ట్ గా చిన్న బడ్జెట్ సినిమాలు కొత్త కంటెంట్ తో వస్తున్నాయి.


అలా వచ్చి హిట్టు కొడుతున్న వారిలో ముందున్నాడు అడివి శేష్. క్షణం, గూఢచారి సినిమాలతో హిట్ అందుకున్న అడివి శేష్ రీసెంట్ గా వచ్చిన ఎవరు సినిమాతో కూడా సూపర్ హిట్ అందుకున్నాడు. వెంకట్ రాంజీ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో అడివి శేష్ తో పాటుగా రెజినా, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో నటించారు.


ఆగష్టు 15న రిలీజైన ఈ సినిమా మొదటి షో నుండి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. 9.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన ఎవరు సినిమా 4 వారాల్లో 13.1 కోట్ల షేర్ వసూళు చేసింది. అంటే వరల్డ్ వైడ్ గా 22 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది ఎవరు మూవీ. పివిపి బ్యానర్ లో పరం వి పొట్లూరి ఈ సినిమా నిర్మించారు.


సినిమాను కొన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్ కు లాభం వచ్చినట్టే అంటున్నారు. స్టార్ సినిమాలు వందల కోట్లతో తీస్తుంటే కనీసం 10 కోట్లు కూడా కాని ఇలాంటి సినిమాలు సేఫ్ ప్రాజెక్టులు అవుతున్నాయి. తప్పకుండా తెలుగు పరిశ్రమలో ఈ మార్పు మంచి పరిణామాలకు దారి తీస్తుందని చెప్పొచ్చు. అడివి శేష్ ప్రస్తుతం మేజర్ సినిమా చేస్తున్నాడు. దానితో పాటుగా గూఢచారి 2 ని సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: