బిగ్ బాస్ తెలుగులో ఒక ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. గత రెండు సీజన్లలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన కంటెస్టెంట్ నామినేషన్ లో ఉన్న మొదటి వారమే హౌస్ నుండి బయటకు వెళ్లిపోయారు. ఈ వారం కూడా అదే జరుగుతుందేమో ముందు నుంచే అంతా అనుమానిస్తున్నారు. అనగా.... అనుకున్న దాని ప్రకారం ఈ వారం కొత్తగా వచ్చిన కంటెస్టెంట్ శిల్ప చక్రవర్తి కాబట్టి ఆమెనే హౌస్ నుండి వెళ్లిపోవాలి. చివరికి అదే జరిగింది కూడా. అంతా అనుకున్నట్టే శిల్ప చక్రవర్తి బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయిందట.

ఈ వారం ఎలిమినేషన్ లో శిల్ప, శ్రీముఖి, హిమజ, మహేష్ మరియు పునర్నవి ఉన్నారు. మహేష్, పునర్నవి మరియు శిల్ప చక్రవర్తి మధ్య ఎవరో ఒకరు బయటకు వెళ్తారు అని అంతా అంచనా సమయంలో పునర్నవి తను షూస్ పాలిష్ చేయనని నిబ్బరంగా కూర్చున్నప్పుడు తనకు బాగానే ఓట్లు పడ్డాయి. ఇక శిల్పా చక్రవర్తి వచ్చి ఒక వరమే కావడం, ఉన్న కొద్ది రోజుల్లో కూడా ఆమె పెద్దగా తనను తాను నిరూపించుకోకవడం పెద్ద ప్రతికూలాంశం. అదీ కాకుండా సీనియర్ యాంకర్ అయిన శిల్పా చక్రవర్తితో పోలిస్తే యువతంతా మహేష్ మరియు పునర్నవి వైపే మొగ్గు చూపారని చెప్పాలి. 

ఇంటిలోకి చాలా హడావిడిగా వచ్చిన శిల్పా చక్రవర్తి ప్రయాణం చివరికి మూడునాళ్ళ ముచ్చటగా మిగిలింది. వచ్చిన మొదటి రోజు నుంచే అనవసరమైన టాపిక్ లు లేవనెత్తడం.... బాబా భాస్కర్ లాంటి వ్యక్తి జోక్ చేస్తే దాన్ని ఆమె వేరే లాగా తీసుకొని అనవసరంగా దాని గురించి ఎక్కువ సేపు మాట్లాడడం… ఇంకా హౌస్ మేట్స్ లో ఎవరితో పెద్దగా కలవలేకపోవడం కూడా ఆమెను ఇంటి నుంచి బయటకు పంపేందుకు తోడ్పడ్డాయి. మరోసారి బావ భాస్కర్ వాక్కు కూడా ఫలించింది. గత కొద్ది వారాలుగా అతను ఎవరు హౌస్ లో ఉంటారు.. ఎవరు వెళ్లిపోతారని సరిగ్గా అంచనా వేస్తున్నాడు. ఇక నుంచి బాబా భాస్కర్ ని బిగ్ బాస్ కి అసలైన బాబా అనడంలో ఎలాంటి సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: