మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’.  కొణిదెల రాంచరణ్ నిర్మాణ సారథ్యంలో సురేందర్ రెడ్డి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ సినిమా తెలుగు, మళియాళ,కన్నడ, హిందీ భాషల్లో అక్టోబర్ 2 న రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఇప్పటికే ఈ మూవీ టీజర్, ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. అయితే సైరా మొదలు పెట్టినప్పటి నుంచి కొన్ని సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి.  సైరా షూటింగ్ కి అనుమతి లేదని జీహెచ్ఎంసి మొత్తం ఖాళీ చేయించిన సంఘటన మరువక ముందే మరో సెట్ అగ్ని ప్రమాదానికి గురైంది. 

ఇక మరో ముఖ్యమైన సమస్య ఉయ్యాలవాడ వంశీయులు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా తీయడం మాకు ఎంతో గర్వంగా ఉన్నా..ఆయన చరిత్ర తీస్తున్నందున తమకు కొంత సహాయం చేస్తామని చిత్ర యూనిట్ హామీ ఇచ్చిందని..కానీ ఇప్పటి వరకు ఆ ఊసే తీసుకు రావడం లేదని ఆ మద్య వారి కుటుంబ సభ్యులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. నరసింహారెడ్డి సినిమాకు కావలసిన సమాచారంతో పాటు , సినిమాకి అవరసరమైన లొకేషన్స్‌, నరసింహారెడ్డి గారి జీవిత చరిత్రను పూర్తిగా చిత్ర బృందానికి తెలియజేశాము.

సినిమాకు కావాల్సిన పూర్తి సమాచారం తెలుసుకుని షూటింగ్ ను పూర్తి చేసుకొని ఇప్పుడు తమకు ఎలాంటి న్యాయం చేయడం లేదని ఉయ్యాలవాడ వంశీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తమకు మెగాస్టార్ చిరంజీవి సరైన న్యాయం చేస్తామని హామీ కూడా ఇచ్చారని..కానీ ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం చేయలేదని వాపోతున్నారు. మరి చిత్ర నిర్మాతలు ఎందు చేత పట్టించుకోవడం లేదో తెలియడం లేదని..ఒకవేళ సినిమా రిలీజ్ బిజీ లో ఉండడం వల్ల ఈ జాప్యం జరుగుతుందా తెలియాల్సి ఉంది.

ఏది ఏమైనా తమకు న్యాయం జరిగే వరకు వారు వదిలేలా లేరని సినీ వర్గాల్లో చర్చనడుస్తుంది. ఈ మూవీ లో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతిబాబు, నయనతార, తమన్నా , నిహారిక వంటి స్టార్స్ నటిస్తుండడం తో ఈ సినిమా ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: