సూపర్ స్టార్ మహేష్ బాబు అందగాడు. అతను మగాళ్ళకే తన అందంతో అసూయ పుట్టిస్తాడు. మహేష్ పక్కన ఏ హీరోయిన్ కూడా ఆనదన్నది అక్షర సత్యం. మహేష్ ఉంటే చాలు ఆడా మగా ఆడియన్స్ కళ్ళు అన్నీ తెర మీద ఆయన్నే చూస్తాయి. దాంతో హీరోయిన్ ఎవరున్నా పెద్దగా  ఎలివేట్ అవరని కూడా అంటారు. ఇదిలా ఉండగా మహేష్ బాబు చాలా రిజర్వ్ గా ఉంటాడు. తనేంటో తన పనేంటో అన్నట్లుగా ఆయన యాటిట్యూడ్ ఉంటుంది.


అలాంటి మహేష్ ఈ మధ్య తన ప‌ర్సనల్ విషయాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నాడు. అందులో  భాగంగా మహేష్ తనకు మైగ్రేన్  ప్రాబ్లం ఉందని చెప్పుకొచ్చాడు. దాంతో చాలా కాలం పాటు నానా బాధ పడ్డాడుట. ఒకసారి వస్తే ఆరేడు గంటల పాటు అలాగే ఉంటూ ఎంతో హింస పెట్టేదని మహేష్ చెప్పుకున్నాడు. దానిని మందులు లేవని అందరూ చెప్పడంతో పెయిన్ కిల్లర్స్ వేసుకుని గడిపేవాడినని మహేష్ చెప్పారు. అలాగే షూటింగులకు వెళ్ళడం తనకు ఎంతో బాధగా ఉండేదని కూడా మహేష్ అన్నాడు. అక్కడ లైట్లు, సౌండ్స్ ఇంకా చిర్రెత్తించేవని కూడా చెప్పుకొచ్చాడు. అయితే ఎన్నో మందులు చేయలేని పనిని నాడీ వైద్యం చేసిందని మహేష్ చెప్పాడు.


నాడీ వైద్యం తీసుకోవడం ద్వారా తాను మైగ్రేన్ నుంచి విముక్తి పొందానని, ఇపుడు హ్యాపీగా ఉంటున్నానని కూడా చెప్పాడు. ఈ విషయం తాను ఎందుకు చెబుతున్నడంటే మైగ్రేన్ కి కూడా మందు ఉందని అవేర్ చేయడానికట. ఈ విషయన్ని చెబుతూ  మహేష్ ఆరోగ్య సమస్యలు వచ్చినపుడు క్రుంగిపోకుండా నివారణ ఉపాయం చూడాలని ఫ్యాన్స్ కి  సూచించాడు. మొత్తానికి సూపర్ స్టార్ కూడా కంటికి కనబడని శత్రువుతో చాలా ఏళ్ళు పోరాడడన్న మాట.



మరింత సమాచారం తెలుసుకోండి: