నిన్నటి తరం హీరోయిన్ శిల్పాశెట్టి తెరపైకి వచ్చిపదేళ్లయింది. ఫేడ్ అవుట్ అయిన ఈ సీనియర్ హీరోయిన్ ను పిలిచి పదికోట్లు ఇస్తానంటే.. నో  చెప్పేసింది. మనసు చంపుకొని నటించలేనంటోంది. వ్యాపారవేత్త రాజ్ కుంద్రాతో వివాహం తర్వాత శిల్పాశెట్టి వెండితెరకు దూరమైంది. 13ఏళ్లపాటు నటనకు దూరంగా ఉన్నా.. యోగా పాఠాలు చెబుతూనే ఉంది. ఈమెను చాలామంది యోగా గురువుగా భావిస్తూ.. ఫాలో అవుతుంటారు. ఫిట్ నెస్ కు సంబంధించిన ఓ ఆయుర్వేద కంపెనీ స్లిమ్మింగ్ పిల్స్ కు ప్రచారకర్తగా వ్యవహరించాలని.. అందుకు రూ.10కోట్లు ఇస్తామని ఆఫర్ చేసింది. 


సన్నబడటానికి వాడే మాత్రల ప్రచారకర్తగా వ్యవహరిస్తే వచ్చే 10కోట్ల రూపాయలను రిజక్ట్ చేసింది శిల్పాశెట్టి. తాను నమ్మని విషయాలను ప్రజలకు చెప్పనంటూ బంపర్ ఆఫర్ ను వదిలేసింది. సహజసిద్ధంగా బరువు తగ్గితేనే ఆరోగ్యమని చెప్పింది శిల్పా. స్లిమ్మింగ్ పిల్స్.. కడుపు మాడ్చుకోవడం ద్వారా బరువు తగ్గరంటోంది ఈ యోగా బ్యూటీ. 


దశాబ్ధం తర్వాత కెమెరా ముందుకు వచ్చిన శిల్ప "నికమ్మ" అనే హిందీ సినిమాలో నటిస్తోంది. ఇన్నేళ్ల విరామం తర్వాత నటించడం ఆనందంగా ఉందని.. ఇప్పటి వరకు చూడని సరికొత్త పాత్రలో చూస్తారంటోంది ఈ పొడుగు కాళ్ల సుందరి. మనస్సాక్షిని చంపుకొని స్లిమ్మింగ్ పిల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండలేనంటూ.. 10కోట్లు వదులుకున్న శిల్పాను నెటిజన్లు తెగ మెచ్చేసుకుంటున్నారు. కోట్లు డబ్బులిస్తామంటే.. ఏ పని చేయడానికై సిద్ధమే అని ముందుకెళ్లే ఈ రోజుల్లో 10కోట్లు వదులుకున్న శిల్పాశెట్టిని నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. అంతేకాదు శరీరం సన్నబడాలన్న ఆశతో లేనిపోని టాబ్లెట్స్ తీసుకోవద్దని సూచిస్తోంది ఈ సీనియర్ హీరోయిన్. శరీరం ఫిట్ నెస్ గా ఉండేందుకు యోగా.. వ్యాయామం చేయాలని సలహా ఇస్తోంది. అంతేకాదు అందుకు తగ్గ పోషకాహారం తీసుకోవాలంటోంది.  






మరింత సమాచారం తెలుసుకోండి: