కొత్త దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ మూవీకి ప్రిపేర్ అవుతున్నాడు. ఈ సినిమాలో ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ నభా నటేష్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై భోగవల్లి బాపినీడు నిర్మించనున్నారు. ఈ సినిమాతో పాటు సాయి ధరమ్ తేజ్ మరో రెండు కొత్త సినిమాలను సైతం లైన్ లో పెట్టినట్టు సమాచారం. దర్శకుడు మలినేని గోపీచంద్ దర్శకత్వంలో మరోసారి నటించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇంతకుముందు ఈ కాంబినేషన్ లో వచ్చిన విన్నర్ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. అయినప్పటికీ మలినేని గోపిచంద్ తో మరో సినిమాకు తేజు సిద్ధమయ్యాడు. దీంతో పాటు దేవకట్టా దర్శకత్వంలో మరో సినిమాకు ప్లాన్ జరుగుతోందట. మొత్తానికి ఈ మెగామేనల్లుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.