అల్లు అర్జున్ నటించిన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా ఎన్నో అంచనాల మధ్య వచ్చినా యావరేజ్ గా నిలిచింది. వాస్తవంగా బన్ని ఈ సినిమా మీద చాలానే ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఆ ఆశలు నిరాశలుగా మిగిలిపోయాయి. అందుకే తన నెక్స్ట్ సినిమా కమిటవడానికి చాలా సమయం తీసుకొని మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో నటించడానికి ఓకే చెప్పాడు. గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి వచ్చాయి. ఆ రెండు సినిమాలు యావరేజ్ అనే చెప్పాలి. అందుకే ఈ సారి బ్లాక్ బస్టర్ కి ట్రై చేస్తున్నాడు. ఇక ప్రభాస్‌కి హిందీలో మార్కెట్‌ సాహో తో స్థిరపడిపోయింది. ప్రభాస్ లాగానే ఎన్టీఆర్‌, చరణ్‌.. ఇద్దరూ రాజమౌళి సినిమాతో బాలీవుడ్‌ ప్రేక్షకులని ఆకట్టుకునేందుకు క్యూలో వున్నారు. ఇంతకాలం హిందీవైపు చూడని అల్లు అర్జున్‌కి కూడా అక్కడ మార్కెట్ మీద గ్రిప్ తెచ్చుకోవాలని ఆలోచన వచ్చింది. ఇప్పటికే బన్ని హిందీ అనువాద చిత్రాలకి మిలియన్ల కొద్దీ వ్యూస్‌ వస్తున్నాయి కాబట్టి స్ట్రెయిట్‌గా ఒక సినిమా అక్కడ విడుదల చేయాలని అల్లు అర్జున్‌ స్కెచ్ వేసుకుంటున్నాడని తాజా సమాచారం.

అందుకే త్వరలోనే ఒక పాన్‌ ఇండియా కథతో సినిమా చేయాలని అల్లు అర్జున్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. తన దగ్గరకు వచ్చే దర్శకులకి కూడా ఇదే చెబుతున్నాడని లేటెస్ట్ న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్ లో బాగా వైరల్ అవుతోంది. కేవలం తెలుగు సినిమా మార్కెట్‌ని దృష్టిలో వుంచుకోవడం కాకుండా హిందీలో కూడా రికార్డ్స్ స్థాయిలో కలెక్షన్స్ వచ్చే సబ్జెక్ట్‌ పట్టుకురమ్మని అడుగుతున్నాడట. ఆల్రెడీ ఓకే అయిన 'ఐకాన్‌' కథని కూడా అలా పాన్‌ ఇండియా మార్కెట్‌కి తగ్గట్టుగా మార్చమని అడిగినట్టు ఫ్రెష్ అప్‌డేట్.

తన తోటి హీరోలు హిందీలో మార్కెట్‌ తెచ్చుకుంటూ వుంటే తాను మాత్రం రాజమౌళి వచ్చే వరకు ఎందుకు ఎదురు చూడాలని అనుకుంటున్నాడేమో మరి. ఇంతకుముందు తమిళంలో స్ట్రెయిట్‌ సినిమా చేయాలని చూసాడు కానీ ఆ ఆలోచన డ్రాప్‌ అయ్యాడు. మరి హిందీ కలని అయినా పట్టాలెక్కిస్తాడా లేదా అనేది వేచి చూడాల్సిందే. ఇక అల్లు అరవింద్ తలుచుకుంటే అంత పెద్ద విషయమేమి కాదని అందరికి తెలిసిన విషయమే. కొడుకు కోసం కావాలంటే డైరెక్ట్ గా బన్ని తో ఒక భారీ బడ్జెట్ తో బాలీవుడ్ లో సినిమా నిర్మించడం అంత కష్టమేమి కాదు. మరి ఎలా ప్లాన్ చేస్తారో అల్లు ఫ్యామిలి చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: