బిగ్‌బాస్‌ ఏ ముహుర్తాన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్‌ ఇచ్చాడో కానీ హౌస్‌ మొత్తం గందరగోళంగా మారింది. ఈ టాస్క్‌లో దెయ్యాలు రెచ్చిపోవ‌డంతో మ‌నుష్యులుగా ఉన్న శ్రీముఖి, మహేష్‌, పునర్నవిల మెడకు చుట్టుకుంది. ఇక కొంద‌రు టోట‌ల్‌గా బిగ్‌బాస్‌లో ఇది అత్యంత చెత్త టాస్క్‌గా విమ‌ర్శించారు. ఇక ఈ టాస్క్‌లో బెస్ట్ పెర్పామెన్స్ ఇచ్చిన వారిని నాగ్ మెచ్చుకోగా... వ‌ర‌స్ట్ పెర్పామెన్స్ ఇచ్చిన వాళ్ల‌కు బిగ్‌బాస్ ప‌నిష్మెంట్లు ఇచ్చారు.


ఈ క్ర‌మంలోనే ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్‌లో చెత్త పర్ఫామెన్స్‌ ఇచ్చినందుకు గానూ బిగ్ బాస్‌ శ్రీముఖి, మహేష్‌, పునర్నవి ముగ్గురికి పనిష్మెంట్‌ను ఇచ్చాడు. ఈ ముగ్గురికి ఓపెన్ ఏరియాలో షూ పాలిష్‌ చేయాలంటూ ఇచ్చిన టాస్క్‌ను పునర్నవి, మహేష్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు షూ పాలిష్‌ చేయమంటాడు.. రేపు చెడ్డీలు ఉతకమంటాడు అంటూ మహేష్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. అలాగే షూ పాలీష్ చేయ‌ని పున‌ర్న‌విపై సైతం నాగ్ తాను స్టేజ్ మీద షూ పాలీష్ చేసి ఫైర్ అయ్యారు.


ఇక బిగ్ బాస్ హౌస్‌లో దెయ్యం టాస్క్‌లో భాగంగా శ్రీముఖి తాను ఆడ‌క‌పోవ‌డంతో పాటు ఇత‌రులు కూడా ఆడ‌కుండా చేసింది. దీనిని ప్ర‌స్తావించిన నాగ్ శ్రీముఖిపై ఫైర్ అయ్యారు. కూసే గాడిద వ‌చ్చి మేసే గాడిద‌ను చెడ‌గొట్టిన చందంగా నీ ఆట ఉంద‌ని విమ‌ర్శించారు. శ్రీముఖి అది త‌న అభిప్రాయం అని చెప్పుకునే ప్ర‌య‌త్నం చేసినా నాగ్ ఆమెను మాట్లాడ‌నీయ లేదు. నువ్వు హౌస్‌కు బాస్ వి కాద‌ని... బిగ్ బాస్ హౌస్‌కు బిగ్ బాస్ అని చెప్పారు. ఇక నాగ్ శ్రీముఖికి కౌంట‌ర్ ఇస్తోన్న టైంలో ఆమె ఫేస్ మాడిపోయింది. ఎప్పుడూ న‌వ్వుతూ ఉండే ఆమె ఫేస్‌లో భూత‌ద్దం పెట్టి వెతికి చూసినా స్మైల్ అనే ఛాయే లేకుండా పోయింది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: