గత గొంతకాలంగా సోషల్ మీడియాలో మౌనంగా రేణు దేశాయ్ ఉంటోంది. దీనితో ఆమెకు సంబంధించిన వార్తల హడావిడి బాగా తగ్గిపాయింది. ఆమధ్య హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాను అంటూ ఆమె లీకులు ఇవ్వడంతో ఆమె ఇక్కడ సినిమాలలో కూడ నటిస్తుంది అంటూ వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పుడు మళ్ళీ మరొక విధంగా రేణు దేశాయ్ వార్తలలోకి వచ్చింది. ఈమెకు డెంగీ జ్వరం రావడంతో హాస్పటల్ లో చేరి వైద్యం చేయించుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను అంటూ ఆమె తన గురించిన న్యూస్ ను అందరికీ షేర్ చేసింది. దీనికి సంబంధించి ఇన్ స్టా గ్రామ్ లో ఒక ఫోటోను షేర్ చేస్తూ మెసేజ్ కూడ పెట్టింది. 

‘నా ముఖం చూశారుగా అందులో బాధ కనిపించడానికి కారణం డెంగీ. కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్నాను. కోలుకుంటున్న సమయంలో ఢీ చాంపియన్స్ రియాలిటీ షోలో పాల్గొనాల్సి వచ్చింది. కొన్ని గంటలే షూటింగ్ కావడంతో కాదనలేక పోయాను.'' అని అంటూ రేణు దేశాయ్ ఒక సెల్ఫీ పిక్ ను పోస్ట్ చేస్తూ తన బాధను వ్యక్త పరుచుకుంది. 

అంతేకాదు ‘దోమలతో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. దోమల నుంచి కాపాడుకోవడానికి క్రీములు రాసుకోవడంతో పాటు, ఒళ్లంతా కప్పి ఉంచే దుస్తులు ధరించండి. దోమకాటుకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి'' అని తన అభిమానులకు ఆరోగ్య సూత్రాలు జాగ్రత్తలు తెలియ చేస్తోంది.  2017లో స్టార్ మా టీవీలో 'నీతోనే డాన్స్' అనే కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించిన రేణు దేశాయ్ కి ఆతరువాత బుల్లితెర కార్యక్రమాలకు సంబంధించి అనేక ఆఫర్లు వచ్చినా వాటిని పట్టించుకోకుండా రైతుల సమస్యల పై ఒక సినిమా తీయాలని చాల ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఆమెను నమ్మి నిర్మాతలు ఎవ్వరు ముందుకు రాకపోవడంతో ప్రస్తుతం రేణు దేశాయ్ ఎటూ తేల్చుకోలేని అయోమయ పరిస్థిలో ఉన్నట్లు తెలుస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: