నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు ఎంతటి ఘన విజయాలను అందుకున్నాయో అందరికి తెలిసిందే. ఈ రెండు సినిమాలు బాలయ్య కి తన సినీ కెరీర్ లో టాప్ టెన్ మూవీస్ లిస్ట్ లో ఖచ్చితంగా ఉంటాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఆ తర్వాత బాలయ్య-బోయపాటి మళ్ళీ సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నప్పటికి కార్య రూపం దాల్చలేదు. అంతేకాదు బోయాపటి వినయ విధేయ రామ తర్వాత బాలయ్యతో సినిమా చేస్తున్నాడనే వార్త బాగా వైరల్ అయింది. కాని వినయ విధేయ రామ ఫ్లాపవడంతో బోయపాటికి నో చెప్పాడని అనుకున్నారు. అయితే కే.ఎస్.రవి కుమార్ తో ప్రస్తుతం సినిమా చేస్తున్న బాలయ్య నెక్స్ట్ బోయపాటి శ్రీనుతో సినిమా చేయబోతున్నాడు. 

ఈ కాంబో సినిమాకు సంబంధించి అంతా రెడీ అయింది. బాలయ్య బోయపాటి సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీంద్ర నిర్మించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా లాంచ్ కానుంది. ఈ ఫ్రెష్ అప్‌డేట్ తో బాలయ్య ఫ్యాన్స్ కి మాంచి ఉత్సాహాన్నిచ్చింది. ఇప్పటికే బాలయ్య సినిమా కోసం కథను సిద్ధం చేసిన బోయపాటి ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ అయ్యాడు. రామ్ చరణ్ తో వినయ విధేయ రామ తీసి ఘోరమైన అపజయం అందుకున్న బోయపాటి ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడట. అందుకే కథ కోసమే ఎక్కువ టైం తీసుకున్నాడని తెలుస్తుంది. తమ కాంబో సినిమాలో ఎలాంటి మాస్ అంశాలు ఆశిస్తారో అవన్నీ ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. ఎలాగైనా సింహ, లెజెండ్ ని మించి హిట్ కొట్టాలని పట్టుదలగా ఉన్నాడని సమాచారం. 

ఇప్పుడు ఇద్దరూ కలిసి హ్యాట్రిక్ హిట్ అందుకోవడానికి రెడీ అవుతున్నారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కి ప్లాన్ చేస్తున్నారు.ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించే ఛాన్స్ ఉంది. ఈ మధ్య దేవి శ్రీ ప్రసాద్ తెలుగులో సినిమాలు చేయడం కాస్త తగ్గిపోయింది. దేవి హడావిడి అసలు కనిపించడం లేదు. ఒకవేళ బాలయ్య-బోయపాటి సినిమా కి దేవి మ్యూజిక్ ఇస్తే మాత్రం మళ్ళీ దేవి రచ్చ మొదలవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: