బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మంచి నటి అని చెప్పడానికి ఆమెకు వచ్చిన రెండు నేషనల్ అవార్దు చాలు. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధిస్తున్నాయి. అయితే కంగానా కు స్టార్ డమ్ వచ్చిన తరువాత వివాదాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఆమె అనుకున్న విషయాన్ని భయపడకుండా బయటకు చెప్పే ఆమె అటిట్యూడ్ వల్ల కంగనా రనౌత్ వివాదాల్లో ఇరుక్కుటుంది.
ప్రస్తుతం దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవతా చరిత్ర ఆధారంగా రెండు సినిమాలు. ఒక వెబ్ సిరీస్ లు రూపొందుతున్న విషయం అందరికి తెలుసు.దర్శకుడు ఏఏల్ విజయ్ "తలైవి" సినిమాని తెలుగు తమిళ హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు .ఈ సినిమా లో కంగనా రనౌత్ దివంగాత ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో కనిపించనుంది. ఈ పాత్ర కోసం క్లాసికల్ డ్యాన్స్లో శిక్షణ తీసుకుంటున్నారు. అయితే ఈ సినిమా కోసం కంగనా రనౌత్ 20 కోట్లు పారితోషకం డిమాండ్ చేస్తోందనే వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
రీసెంట్ నటీ నయనతార ఒక్క సినిమా కు దాదాపు 5 నుండి 6 కోట్లు పారితోషకం డిమాండ్ చేస్తుందని సినీ వర్గాల టాక్ బయటకి వచ్చినపుడు అందరు షాక్ అయ్యారు.కానీ కంగనా 20 కోట్లు డిమాండ్ చేస్తోందనే వార్తలు రావడంతో అందరు ఆశ్చర్యపొతున్నారు. ఇండియలో చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే 20 కోట్ల పారితోషకం తీసుకుంటారు.
తలైవి సినిమా మేకప్ కోసం కెప్టెన్ మర్వెల్, హంగర్ గేమ్స్, బ్లేడ్ రన్నర్ సినిమాలకు పని చేసిన జసన్ కాలిన్స్ పని చేస్తున్నారని.ఈ సినిమా లో కంగనా నాలుగు గెటప్స్ లో కనబడనుంది. ఈ సినిమా షూటింగ్ దీపావళి తరువాత మొదలవుతుంది అని నిర్మాత విష్ణు ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం కంగనా రనౌత్ "ధాకడ్ "అనే యాక్షన్ మూవీ లో నటిస్తుంది.ఈ సినిమా దీపావళి 2020 విదుదల కానుంది .