జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య ప్రముఖ నటి దర్శకురాలు రేణుదేశాయ్ హెల్త్ కండిషన్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఇప్పుడు వైరల్ గా మారాయి. గత కొన్ని రోజుల నుండి రేణుదేశాయ్ డెంగీ తో బాధపడుతున్నట్లు సమాచారం. ఇప్పుడిప్పుడే రేణు డెంగీ వ్యాధి నుండి కోలుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఇంస్టాగ్రామ్ వేదికగా రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చారు. ఇదే క్రమంలో జ్వరాల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ప్రతిఒక్కరికి వివరించారు. డెంగీ జ్వరం నుంచి కోలుకుంటున్న సమయంలో షూటింగ్‌ చేయాల్సి వచ్చినప్పుడు నేను ఇలా ఉన్నాను అంటూ ఓ ఫొటో పోస్టు చేశారు. ‘ఈటీవీలో ప్రసారం చేయబోయే ‘ఢీ ఛాంపియన్‌’ షో కోసం కొన్ని గంటలపాటు షూటింగ్‌కి నేను నో చెప్పలేకపోయాను. దోమల విషయంలో జాగ్రత్తగా ఉండండి.


మీ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. పొడవైన దుస్తులనే వాడండి’’ అని రేణూ పేర్కొన్నారు. అభిమానులంతా ఆమె కోలుకోవాలని కోరుకుంటున్నారు. సినిమాలకు దూరం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ కి దూరమైన తర్వాత టెలివిజన్ రంగంలో అడుగుపెట్టిన రేణుదేశాయ్ తెలుగులో వస్తున్న రియాల్టీ షోలలో తనదైన శైలిలో రాణిస్తున్నారు. ఒకపక్క టెలివిజన్ రంగంలో రాణిస్తున్న మరోపక్క సామాజికంగా అనేక అంశాలపై రేణు దేశాయ్ తన కెరీర్ ని రాణిస్తున్నారు.


ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఒక పక్క పవన్ కళ్యాణ్ అప్పట్లో ఎన్నికల ప్రచారంలో కర్నూల్ లో పాల్గొన్న క్రమంలో మరోపక్క రేణు దేశాయ్ కర్నూల్ ప్రాంతంలో ఉన్న రైతులతో సమావేశం అయ్యి సంచలనం సృష్టించారు. ఇటువంటి నేపథ్యంలో త్వరలోనే రేణు దేశాయ్ డైరెక్టర్ గా వ్యవసాయంపై సినిమా తీస్తున్నట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: