తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 3 చాలా రసవత్తరంగా సాగుతోంది. నాగార్జున హోస్ట్ గా అందరిని ఆకట్టుకుంటూ షోనీ అద్భుతమైన రీతిలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో గత వారం హౌస్ నుండి ఆలీ ఎలిమినేట్ అవ్వడం అందరికీ షాక్ ఇచ్చింది. ఇటువంటి నేపథ్యంలో ఈ వారం ఎలిమినేషన్ కి  హిమజ, శ్రీముఖి, మహేష్, పునర్నవి, శిల్పా చక్రవర్తి నామినేట్ అవ్వడం జరిగింది. కాగా శనివారం జరిగిన షో లో హిమజా సేఫ్ అయ్యింది. కానీ ఆదివారం జరిగిన షోలో నలుగురు ఇంటి సభ్యులు మిగలగా...జరిగిన ఎపిసోడ్ లో మొట్టమొదటిగా శ్రీముఖి సేవ్ అయినట్లు యాంకర్ నాగార్జున ప్రకటించడం జరిగింది.


అయితే ఆ తర్వాత ఇంటి సభ్యులతో కొన్ని గేమ్స్ ఆడించి స్కిట్స్ చేయించారు. అయితే ఆ తర్వాత మహేష్ సేఫ్ అయ్యారు. అయితే చివరాకరికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ శిల్ప మరియు పునర్నవి మిగలటం జరిగింది. దీంతో వీరిద్దరి ని కన్ఫెషన్ రూమ్ ఒకరిని, కోర్టు యార్డ్ లోకి మరొకరిని పంపారు. కన్ఫెషన్ రూమ్ డోర్ తెరుచుకోవడంతో శిల్ప బయటకు వచ్చింది. దీనితో శిల్పా ఎలిమినేట్ అవుతున్నట్లు నాగార్జున ప్రకటించారు. పునర్నవి సేవ్ అయింది.


వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి ప్రవేశించిన శిల్పా పోటీ కేవలం మూణ్ణాళ్ళ ముచ్చటగానే మిగిలింది. శిల్ప హౌస్ లో కేవలం 14 రోజులు మాత్రమే గడిపింది. ఇంటి సభ్యులంతా శిల్పా చక్రవర్తిని ఉత్సాహపరుస్తూ సెండాఫ్ ఇచ్చారు. అయితే ఎపిసోడ్ మొత్తానికి రాహుల్ ఇంటి సభ్యులనుద్దేశించి టైటిల్ సాంగ్స్ పాడుతూ పేరడీ చేయించడం షో కి హైలెట్ అయింది. ముఖ్యంగా శ్రీముఖి ఉద్దేశిస్తూ ఒసేయ్ రాములమ్మ సినిమాలో పాట పాడుతూ బిగ్ బాసుకే బాసువమ్మా అనే సాంగ్ షోకే హైలెట్ అయింది.ముఖ్యంగా రాహుల్ పునర్నవి ల మధ్య జరిగిన కాఫీ బాయ్ టాస్క్ కూడా అదరగొట్టింది.



మరింత సమాచారం తెలుసుకోండి: