‘ఆర్ఎక్స్-100’ సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ అజయ్‌ భూపతి. వాస్తవిక సంఘటనల ఆధారంగా తీసిన ఈ సినిమా ఊహించని కమర్షియల్ సక్సస్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ సినిమాలో నటించిన హీరో కార్తికేయ, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ బాగా సెటిల్ అయిపోయారు. ముఖ్యంగా పాయల్ అయితే వెంకటేష్, రవితేజ వంటి స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంది. కాని అజయ్ మాత్రం సంవత్సరం నుండి మాస్ మహారాజ కోసం వేయిట్ చేసి చివరి నిముషంలో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. దాంతో చిన్న పాటి రచ్చ కూడా జరిగింది. ఈ వ్యవహారం తర్వాత తన తదుపరి చిత్రాన్ని ‘ఇస్మార్ట్ శంకర్’తో తన కెరీర్‌లోనే అతిపెద్ద హిట్ అందుకున్న హీరో రామ్‌తో చేయాలని నిర్ణయించుకున్నాడట.

రామ్, అజయ్ భూపతి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాను భవ్య క్రియేషన్స్‌ సంస్థ అధినేత ఆనంద ప్రసాద్‌ నిర్మించడానికి రంగం సిద్ధం చేసుకున్నారట. అయితే.. ప్రస్తుతం రామ్‌కు కథ వినిపించే పనిలో అజయ్ బిజీబిజీగా ఉన్నాడట. కథ ఫైనల్ అయ్యాక అధికారికంగా ప్రకటన రానుందని లేటెస్ట్ న్యూస్.

అయితే.. డైరెక్టర్ కిషోర్‌ తిరుమలకు రామ్‌ ఓకే చెప్పాడని టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే తనకు మాస్ టచ్ ఉండే సినిమాల్లో మాత్రమే నటిస్తానని ఇప్పటికే ఎనర్జిటిక్ స్టార్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఇస్మార్ట్ శంకర్ వచ్చిన పాపులారిటీని గుర్తు పెట్టుకొని తనకోసం కథ సిద్దం చేయమని చెప్తున్నారట. మరి అజయ్ భూపతి చెప్పిన కథలో ఏ మాత్రం మాస్ మసాలా ఉందో..? రామ్‌కు కథ ఏ మాత్రం నచ్చుతుందో..? తెలియాల్సి ఉంది. మొత్తానికి చూస్తే రామ్‌కు వరుసగా సినిమాలైతే రెడీగా ఉన్నాయి.. మరి దేనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో మరి. 


మరింత సమాచారం తెలుసుకోండి: