బాలయ్య-బోయపాటి కాంబినేషన్ సినిమా ప్రకటన వచ్చేసింది. ఈ సినిమా కూడా సింహ, లెజెండ్ సినిమాల లాగా బ్లాక్ బస్టర్ అయితే, హ్యాట్రిక్ హిట్ కాంబినేషన్ అవుతుంది. ఇలాంటి కాంబినేషన్ నే మరొకటి కూడా ప్లానింగ్ లో వున్నట్లు తాజా సమాచారం. బాలయ్యతో పూరి జగన్నాధ్ పైసావసూల్ సినిమా తీసిన సంగతి తెలిసిందే. కాస్ట్ ఫెయిల్యూర్ అయింది కానీ, మరీ కమర్షియల్ గా బ్యాడ్ సినిమా అనిపించుకోలేదు. ఈ ఏజ్ లో కూడా బాలయ్య ఫుల్ ఎనర్జీతో నటించాడంటే అది పూరి మ్యాజిక్ అని అందరు అనుకున్నారు. వాస్తవంగా పైసా వసూల్ తర్వాత మళ్ళీ వెంటనే సినిమా ఉందని బాలయ్య ఫ్యాన్స్ అనుకున్నారు. 

ఈ మాట పూరి కూడా చెప్పాడు. కానీ బాలయ్య వేరే సినిమాలతో, పూరి వేరే సినిమాలతో బిజీ అయిపోయారు. రీసెంట్‌గా ఇస్మార్ట్ శంకర్ తో భారీ సక్సస్ ను అందుకున్న పూరి త్వరలో విజయ్ దేవరకొండ తో సెట్స్ మీదకు వెళ్ళడానికి సనాహాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం హీరోయిన్ ని ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు పూరి. ఈ సినిమా తర్వాత బాలయ్య తోనే నెక్స్ట్ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది.

అందులో భాగంగానే బాలయ్య-పూరి కాంబినేషన్ లో సినిమా వుండేలా ఇప్పటి నుంచే ప్లానింగ్ ప్రారంభమైందని, ప్రాధమిక చర్చలు కూడా జరిగాయని తెలుస్తోంది. అయితే ఒకటే అనుమానం, విజయ్ సినిమా కూడా ఇస్మార్ట్ లా హిట్ కొడితే పూరి మళ్లీ ఫుల్ గా ఫామ్ లోకి వచ్చేసినట్లు అవుతుంది. అప్పుడు కచ్చితంగా హీరోలు అంతా పూరి గురించి ఎదురుచూస్తారు. మరి అప్పుడు కూడా బాలయ్యనే ఆప్షన్ గా వుంచుకుంటారా? అన్నది చూడాలి. ఇక ఇటీవలే వచ్చిన డియర్ కామ్రేడ్ విజయ్ కి ఘోర పరాజాయాన్నిచ్చింది. ఎన్నో ఆశలు పెట్టుకొని అదే పనిగా దాదాపు నెలరోజులుగా ప్రమోషన్స్ చేస్తే అంతా వృధా అయిపోయింది. అంతేకాదు ప్రస్తుతం విజయ్ కమిటయిన మరో రెండు సినిమాల విషయంలో కూడా పక్కా క్లారిటి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పూరి తో ప్రాజెక్ట్ అంటే విజయ్ కి హిట్ దక్కే అవకాశాలే ఎక్కువని అనుకోవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: