గత కొంత కాలంగా వరస పరాజయాలతో సతమతమవుతున్న సూర్య లేటెస్ట్ మూవీ ‘బందోబస్త్’ విడుదలకు రెడీ అయింది.  ఒక ప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలతో సమానంగా ఉండే సూర్య మార్కెట్ విపరీతంగా పడిపోవడంతో ‘బందోబస్త్’ మూవీని నిలపెట్టాలని సూర్య ఎంతగానో కష్టపడి ప్రమోట్ చేస్తున్నాడు. 

ఈ సందర్భంలో ఈ మూవీ ప్రమోషన్ కోసం ఈ మధ్య హైదరాబాద్ కు వచ్చిన సూర్య అల్లు శిరీష్ విషయంలో స్పందించిన తీరు అల్లు కంపౌండుకు నచ్చలేదు అన్న గాసిప్పులు వినిపిస్తున్నాయి.   సూర్య హీరోగా నటించిన ఈ సినిమాలో వాస్తవానికి అల్లు శిరీష్ ఒక కీలక పాత్ర చేయాలి. అయితే  కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేయలేక తాను ‘బందోబస్త్’ నుంచి తప్పుకుంటున్నట్టు గతంలో ప్రకటించుకున్నాడు శిరీష్. ఇప్పుడా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. 

ఈసారి శిరీష్ తప్పుకున్న అంశంపై స్వయంగా సూర్య స్పందించాల్సిరావడం అతడిని ఇరుకున పెట్టె అంశంగా మారింది. ‘బందోబస్త్’ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన సూర్యాను ఇక్కడి మీడియా వర్గాలు  అల్లు శిరీష్ తప్పుకున్న అంశం పై సూటిగాఅడిగినట్లు తెలుస్తోంది. మీడియా  వర్గాలు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి సూర్య చాలా ఇబ్బందిపడి నట్లు టాక్. 

కొన్ని పేపర్ ఇష్యూస్ వల్ల ఆఖరి నిమిషంలో మార్పుచేర్పుల వల్ల శిరీష్ ఈ సినిమా చేయలేకపోయాడని సూర్య క్లారిటీ ఇచ్చాడు. అయితే అల్లు శిరీష్ గతంలో చెప్పినట్టు కాల్షీట్ల సమస్య వల్లనే ఈ సినిమాలో అతడు నటించలేకపోయాడని సూర్యచెప్పకుండా ఇలా పేపర్ ఇష్యూస్ అంటూ కొత్త విషయం తెరపైకి తీసుకు వచ్చాడు ఏమిటి అంటూ మీడియా వర్గాలు షాక్ అయినట్లు సమాచారం. వాస్తవానికి ఈప్రాజెక్ట్ నుంచి శిరీష్ ను కోలీవుడ్ హీరో ఆర్య కోసం తప్పిచారు అంటూ అప్పట్లో కోలీవుడ్ మీడియా వార్తలు రాసింది. దీనితో ఈసున్నిత విషయాన్ని సూర్య తెలివిగా డీల్ చేస్తే బాగుండేది అన్న కామెంట్స్ వస్తున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: