'మహర్షి' సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ అనే సినిమా చేస్తున్నాడు మహేష్. రాబోయే సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయాలని డిసెంబర్ కల్లా షూటింగ్ పూర్తి చేయాలని సినిమా యూనిట్ ఈ సినిమాకి సంబంధించిన పనులలో చకచకా వ్యవహరిస్తోంది. ఈ సినిమాతో ఎలాగైనా హ్యాట్రిక్ హిట్ కొట్టాలని మహేష్ సినిమా కోసం చాలా కష్ట పడుతున్నాడు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ మూడు నెలల్లో పూర్తవుతున్న క్రమంలో...మహేష్ బాబు తర్వాత సినిమా ఎవరితో అన్నదానిపై అటు అభిమానుల్లోనూ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఆసక్తి నెలకొంది.


అయితే మహేష్ తో సినిమా చేయడానికి రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా, పరశురామ్ బుజ్జి, త్రివిక్రమ్, వంశీ పైడిపల్లి ఇలాంటి డైరెక్టర్ ల పేర్లు వినపడుతున్నాయి. మరి ఇంతమంది డైరెక్టర్లలో మహేష్ బాబు ఎవరితో సినిమా చేస్తాడు అన్నదానిపై క్లారిటీ రాలేదు. దీంతో మహేష్ బాబు అభిమానులు డైలమాలో ఉన్నారు. మొన్నటి వరకూ మహేష్ పరశురాం బుజ్జితో నెక్స్ట్ సినిమా చేస్తాడనే వార్త చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత వంశీ పైడిపల్లితో సినిమా అన్నారు. కానీ ఇప్పుడు మహేష్ రూట్ మారిందనే టాక్ వినిపిస్తుంది. నెక్స్ట్ త్రివిక్రమ్ తో సినిమా చేసే చాన్స్ కూడా ఉందని అంటున్నారు.


మరి వస్తున్న వార్తలో నిజమెంతో తెలియాలి అంటే మహేష్ స్పందించాల్సిందే. ఇదే క్రమంలో అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా మహేష్ బాబుతో సినిమా చేయడానికి ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి చేసుకున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. మొత్తం మీద సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు ఏ డైరెక్టర్ తో సినిమా ఒప్పుకుంటాడు అన్నదానిపై ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ నెలకొంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: